TPT: ఈ నెల 25న స్థానిక విద్యుత్ ఉపకేంద్రం వద్ద ప్రత్యేక విద్యుత్ అదాలత్ నిర్వహించబడనుంది. జైర్లన్, రిటైర్డ్ న్యాయమూర్తి శ్రీనివాస ఆంజనేయమూర్తి, మరో ముగ్గురు సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని, స్థానికుల డిస్కం సమస్యలను పరిష్కరిస్తారు. బాలాయపల్లి, డక్కిలి, వెంకటగిరి మండలాల వినియోగదారులు ఈ అదాలత్లో తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చని అధికారులు సూచించారు.