ప్రకాశం: మార్కాపురం పట్టణంలోని తోట వారి వీధిలో సోమవారం దమయంతి (16) ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని చూసి బాలిక ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు తెలిపారు. ఓ యువకుడితో చనువుగా మాట్లాడుతున్న విషయాన్ని గుర్తించిన తల్లితండ్రులు మందలించడంతో ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు విచారణలో గుర్తించారు.