ప్రకాశం: టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలో మంత్రి స్వామి తన క్యాంపు కార్యాలయంలో సోమవారం ప్రజల అర్జీలు స్వీకరించారు. పలు ప్రాంతాల నుంచి అర్జీదారులు క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయన వారి సమస్యలను సావధానంగా విని ఫోన్లు ద్వారా అధికారులతో మాట్లాడారు. కొన్ని సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.