అనంతపురం నగరంలోని నీలం రాజశేఖరరెడ్డి భవనంలో “నిరుద్యోగి ఆవేదన సదస్సు” పోస్టర్ను అఖిలభారత యువజన సమైక్య జిల్లా కార్యదర్శి సంతోష్ కుమార్ విడుదల చేశారు. ఎన్నికల ప్రచారంలో నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి ఇవ్వకుండా కాలయాపన చేస్తున్న కూటమి ప్రభుత్వంపై వారు మండిపడ్డారు.