SDPT: కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం ఆదివారం కావడంతో భక్తులతో పోటెత్తింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయ పరిసరాలు కోలాహలంగా మారాయి. భక్తులు పవిత్ర కోనేరులో స్నానాలు ఆచరించి, స్వామివారికి పట్నాలు వేసి, బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.