CTR: పాకాల(మం) పులితివారిపల్లెలో ఓ వ్యక్తి మృతి స్థానికంగా కలకలం రేపింది. ఓ మామిడి తోటలో చలమచర్ల ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి అనుమానాస్పద రీతిలో మరణించి ఉన్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పాకాల సీఐ చిన్న గోవిందు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.