TG: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు మరమ్మతులు చేయాల్సిన బాధ్యత నిర్మాణ సంస్థలదే అని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి స్పష్టంచేసింది. నిర్మాణ సమయంలోనే జరిగిన లోపాల వల్లే బ్యారేజీ దెబ్బతిందని తెలిపింది. వాటి మరమ్మతులు చేయకపోతే క్రిమినల్ కేసులతో సహా నిర్మాణ సంస్థలను బ్లాక్ లిస్టులో పెడతామని అధికారులు స్పష్టం చేస్తున్నారు.