కడప: ప్రజా పరిషత్ స్థాయి సంఘ సమావేశాలను మంగళవారం ఉదయం 10 గంటలకు జిల్లా జడ్పీ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు జడ్పీసీఈవో ఓబులమ్మ తెలిపారు. జిల్లా ప్రజా పరిషత్ ఉపాధ్యక్షులు, జడ్పీటీసీ, కో-ఆప్షన్ సభ్యులు హాజరు కావాలని కోరారు. అధికారులు శాఖాపరమైన ప్రగతి నివేదికలతో సమావేశాలకు రావాలన్నారు. హాజరుకాని వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హచ్చరించారు.