NLR: మర్రిపాడు మండలం తిక్కవరం గ్రామ శివారు ప్రాంతంలో పేకాట ఆడుతున్నారని సమాచారం రావడంతో ఎస్ఐ శ్రీనివాసరావు తన సిబ్బందితో కలిసి సోమవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 8 మందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ. 21,910 నగదు, 8 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిని 8 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.