తెలుగు రాష్ట్రాల్లో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఏపీలో అత్యధికంగా కడప జిల్లా పొట్టిపాడులో 40.7°C నమోదైంది. కర్నూలు, విజయనగరం జిల్లాల్లో 39.9°C ఉష్ణోగ్రతలు నమోదు కాగా, అత్యల్పంగా బాపట్లలో 34°C ఉంది. TGలో కొత్తగూడెం జిల్లాలో గరిష్టంగా 40.7°C నమోదు కాగా, యాదాద్రి జిల్లాలో అత్యల్పంగా 38°C నమోదైంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.