లోకల్ ట్త్రెన్ లో చాలా మంది ప్రయణం చేస్తుంటారు. వివిధ పనుల కోసం వారు వెళ్లే వారు లోకల్ రైళ్లను ఆశ్రయిస్తుంటారు. ఇవి పబ్లిక్ అసెట్ కాబట్టి వాటిని నీట్ గా ఉంచుకోవడం, తోటి ప్రయాణికులతో సామరస్యంగా ఉండటం చాలా ముఖ్యం. ట్రైన్లో ప్రయాణించేటప్పుడు ఎదురు సీటు ఖాళీగా ఉంటే వెంటనే కాళ్లు దానిపై పెట్టేస్తారు కొందరు. అలా చేయడం సరికాదని చెప్పినా వారు వినరు సరికదా..తిరిగి రివర్స్లో దాడికి దిగుతారు. సరిగ్గా అదే జరిగింది ఇక్కడ. అందుకు సంబంధించిన వీడియోను ఓ ప్రయాణికుడు సోషల్మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్గా మారింది. ముంబై లోకల్ ట్రైన్లో ఇద్దరు ప్రయాణీకులు తోటి ప్రయాణికుడి పట్ల దురుసుగా ప్రవర్తించారు. స్నేహితుడితో కలిసి లోకల్ ట్రైన్లో ప్రయాణిస్తున్న యువతి తనకు ఎదురుగా ఉన్న సీటుపై కాలు పెట్టి కూర్చుంది. ఆమె కాళ్లు పెట్టిన సీటులోనే ప్రశాంత్ అనే యువకుడు కూర్చుని ఉన్నాడు. ఆమెను కాలు తీయాలని కోరాడు. అందుకు సదరు యువతి, ఆమె స్నేహితుడు నిరాకరించారు.