ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ చిత్రం 'ప్రాజెక్ట్ కె(project k)' ప్రకటించినప్పటి నుంచి ఏదో ఒక వార్తల్లో నిలుస్తోంది. ఈ చిత్రంలో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, ప్రభాస్, దీపికా పదుకొనే, దిశా పటానీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు చిత్రసీమలో అతిపెద్ద నిర్మాణ సంస్థ అయిన వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కమల్ హాసన్ కీలక పాత్ర పోషించనున్నట్లు మేకర్స్ ఈ మేరకు ప్రకటించారు.
ఈ-పాస్పోర్ట్ కోసం నిరీక్షణకు ఇప్పుడు తెరపడనుంది. పాస్పోర్ట్ సేవా దివాస్ సందర్భంగా త్వరలో పాస్పోర్ట్ సేవా ప్రోగ్రామ్ 2.0ని ప్రారంభించనున్నట్లు విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రకటించారు.
లక్షల రూపాయల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులను వినియోగదారులు ధైర్యంగా ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నారు. ఈ-కామర్స్ కంపెనీలపై పెరిగిన నమ్మకం.. అవి అందించే సేవలు, కస్టమర్ సపోర్ట్ ఇందుకు కారణమని చెప్పవచ్చు.
పశ్చిమ బెంగాల్లోని ఓండా రైల్వే స్టేషన్ సమీపంలో జూన్ 25 ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు రెండు గూడ్స్ రైళ్లు ఢీకొన్నాయి. ఒక గూడ్స్ రైలు మెయిన్ లైన్కు బదులుగా లూప్ లైన్లోకి ప్రవేశించి ట్రాక్పై ఉన్న మరొక గూడ్స్ రైలును ఢీకొట్టింది. దీంతో గూడ్స్ రైళ్లలోని 12 వ్యాగన్లు పట్టాలు తప్పాయి. జూన్ 2 నాటి విషాదకరమైన బాలాసోర్ రైలు ప్రమాదం ఘటన మరువక ముందే మరొకటి చోటుచేసుకుంది. దీంతో ఖరగ్పూర్-బంకురా-ఆద్రా ల...
రష్యాలో వాగ్నర్ తిరుగుబాటు తర్వాత పరిస్థితులు చాలా దారుణంగా మారాయి. మాస్కోలో ఎమర్జెన్సీ విధించారు. అక్కడి ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచించారు. మాస్కోలో సోమవారాన్ని 'నాన్ వర్కింగ్ డే'గా ప్రకటించారు.
ముంబైలో తొలిరోజు వర్షం బీభత్సం సృష్టించింది. గోవండిలోని డ్రెయిన్లో ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. శాంటా క్రజ్లో సముద్రంలో మునిగిపోతున్న ఇద్దరు పిల్లలను ఓ పోలీసు రక్షించాడు. అంధేరీలో మునిగిపోతున్న ఓ మహిళను రక్షించినట్లు కూడా వార్తలు వచ్చాయి.
వాగ్నర్ గ్రూప్ సైనిక హెలికాప్టర్ను తన బలగాలతో పుతిన్ బృందం కూల్చివేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో వాగ్నర్ సైనికులకు పుతిన్ వర్గానికి మధ్య అంతర్గత యుద్ధం జరిగే అవకాశం ఉంది. రష్యా అంతటా పుతిన్ సర్కార్ హైఅలర్ట్ ప్రకటించింది.
నటి జ్యోతిక(Jyothika) 50కి పైగా చిత్రాల్లో నటించింది. అయినా కూడా ఫిట్ నెస్ విషయంలో మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. ఇటీవల తాను వర్క్ అవుట్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అమెరికా పర్యటనలో ఉన్న ప్రధానికి స్వాగతం పలికారు. న్యూయార్క్ ఆకాశ వీధులో పెద్ద బ్యానర్ని లాగుతున్న విమానం మోడీ స్వాగత సందేశాన్ని అందించింది. బ్యానర్పై "అమెరికాకు చారిత్రక సందర్శన" అని రాసి ఉంది.
నేటి కార్పొరేట్ రోజుల్లో ఉద్యోగాలు చేసే చాలా మంది తమ పిల్లల్ని ప్రీ స్కూల్స్ లో పడేసి వెళ్తున్నారు. అయితే ఆ స్కూల్స్ జరిగే విషయాలను, పరిస్థితులను మాత్రం పట్టించుకోవడం లేదు. తాజాగా ఓ బాలుడు మరో బాలుడ్ని చితక బాదిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. స్కూల్ సిబ్బంది పట్టించుకోకపోవడం, పిల్లల్ని సరిగా చూడకపోవడంతో తల్లిదండ్రులు ఇకనైనా అలర్ట్ అవ్వాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఇద్దరు విద్యార్థులు తమ ట్యూషన్ టీచర్ పై తుపాకీతో కాల్పులు జరిపారు. గత కొన్ని రోజులుగా పెండింగ్ ట్యూషన్ ఫీజును చెల్లించమంటూ టీచర్ అడగటంతో విద్యార్థులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ప్రస్తుతం కాల్పులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.