KMR: జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కామారెడ్డి మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పట్టణాభివృద్ధిపై మంత్రితో చర్చించగా, కామారెడ్డిని ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఆయన సూచించారు. అందుకు ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందించాలని ఛైర్పర్సన్ కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్, ఎస్పీలను కూడా ఆమె సత్కరించారు.
PDPL: ధర్మారం ఆదర్శ పాఠశాలలో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సహాయార్థం పాఠశాలలో ఆన్లైన్ చేయడానికి ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపల్ రాజకుమార్ తెలిపారు. 2026- 27 సంవత్సరంలో 6 నుంచి 10వ తరగతి వరకు చేరే అభ్యర్థులు ఈనెల 28లోగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని ఆయన సూచించారు.
ADB: చైల్డ్ పోర్న్ వీడియోలు చూసినా, డౌన్లోడ్ చేసినా, సోషల్ మీడియాలో షేర్ చేసిన, ఆన్లైన్లో చూసిన కఠిన చర్యలు తప్పవని ఎస్పీ అఖిల్ మహాజన్ శుక్రవారం తెలియజేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై పోక్సో కేసు కూడా నమోదు చేయడం జరిగిందని వెల్లడించారు. చైల్డ్ పోర్నోగ్రఫీ అనేది ఒక తీవ్రమైన నేరమని SP అఖిల్ మహాజన్ పేర్కొన్నారు.
ADB: సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన తప్పనిసరిగా కలిగి ఉండాలని సైబర్ క్రైమ్ ASI సురేందర్ అన్నారు. శుక్రవారం ఉట్నూర్ మండలంలోని కేబీ కాంప్లెక్స్ లో ఇటీవల నూతనంగా ఎన్నికైన సర్పంచులకు సైబర్ నేరగాళ్లు చేస్తున్న మోసాల గురించి వివరించారు. అపరిచిత వ్యక్తులకు ఫోన్ ద్వారా వచ్చే OTP, KYC పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. నేరాలకు గురైతే 1930 కు సంప్రదించాలని కోరారు.
NGKL: కొల్లాపూర్ మున్సిపాలిటీ కార్యాలయంలో శుక్రవారం నూతన పాలకవర్గం బాధ్యతలు స్వీకరించింది. మున్సిపల్ ఛైర్ పర్సన్ రెడ్డి జ్యోతి సత్యనారాయణ, వైస్ ఛైర్మన్గా షేక్ రహీం పాషా బాధ్యతలు చేపట్టారు. మున్సిపల్ అధికారులు, సిబ్బంది నూతన పాలకవర్గాన్ని ఘనంగా సత్కరించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు సహకారంతో కొల్లాపూర్ను అభివృద్ధి చేస్తామని తెలిపారు.
SRD: సదాశివపేట మున్సిపల్ ఛైర్మన్ అంజమ్మ ఆధ్వర్యంలో టీజీఐఐసీ నిర్మల రెడ్డితో కలిసి కలెక్టర్ ప్రావీణ్యను శుక్రవారం కలిశారు. నూతనంగా గెలిచిన కౌన్సిల్ సభ్యులను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేయాలని చెప్పారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు పాల్గొన్నారు.
MNCL: ఈ నెల 17న హైదారాబాద్లో జరిగిన రాష్ట్ర స్థాయి దివ్యాంగ విద్యార్థుల క్రీడా పోటీలలో జిల్లాకు చెందిన విద్యార్థులు ప్రతిభ కనబరిచి పతకాలు సాధించారు. ఈ సందర్భంగా శుక్రవారం భవిత కేంద్రంలో డీఈవో యాదయ్య విజేతలకు మెడల్స్, సర్టిఫికెట్లు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. దివ్యాంగ చిన్నారుల విజయాలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం అన్నారు.
BDK: ఈనెల 22వ తేదీ వరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పొడి వాతావరణ ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 23 నుంచి 25వ తేదీల్లో జిల్లాలో అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని చెప్పారు. పగటి ఉష్ణోగ్రత 34°C నుంచి 36°C ఉంటుందని తెలిపారు. చిరుజల్లులు కురిసే అవకాశం ఉన్నందున రైతులు పంట తడవకుండా టార్పాలిన్ అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు.
WGL: నెక్కొండ(M) కేంద్రంలోని అక్కల్ చెడు GPలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి నేతృత్వంలో అభివృద్ధి దిశగా ప్రయాణిస్తుందని అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వలన గ్రామాల్లో అభివృద్ధి నోచుకోలేదని విమర్శించారు. అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.
BDK: కొత్తగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నిర్వహిస్తున్న దివ్యాంగుల వైకల్యం నిర్ధారణ సదరం క్యాంపును శుక్రవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన పరిశీలించారు. ఈ సందర్భంగా క్యాంపులో నిర్వహిస్తున్న దివ్యాంగుల వైద్య పరీక్షలు, ఆన్లైన్ దరఖాస్తుల నమోదు విధానాన్ని ఆమె ప్రత్యక్షంగా పరిశీలించారు. దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
MBNR: గండీడ్ మండలం లింగాయపల్లి, సల్కర్పేట్ గ్రామాల్లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లకు లబ్ధిదారులు గృహప్రవేశం చేశారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జితేందర్ రెడ్డి, పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. మొదటి విడతకు అభినందనలు తెలిపారు. త్వరలో రెండో విడత మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
SDPT: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం సర్పంచుల ఫోరం హుస్నాబాద్ అధ్యక్షుడిగా గాంధీనగర్ గ్రామ సర్పంచ్ పోలు సంపత్ను మండలంలోని 17 గ్రామాల సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు సంపత్ మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో సర్పంచులకు ఏ సమస్య ఉన్నా ముందుండి మరి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.
JGL: కోరుట్ల మండలంలోని కల్లూరు గ్రామంలో గల మోడల్ స్కూల్ విద్యార్థులకు మట్టి నమూన పరీక్షపై అవగాహన సదస్సును శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్బంగా మండల వ్యవసాయ అధికారిని నాగమణి మట్లాడుతూ.. సేంద్రియ, సహజ వ్యవసాయం నేలలో సరైన ఆరోగ్యంగా పెరుగుతుందన్నారు. రసాయన ఎరువులు వాడకంతో నేలలో సారం తగ్గిపోతుందన్నారు. అలాగే నేలలో జరిగే చర్యల గూర్చి విద్యార్థులకు వివరించారు.
MNCL: మంచిర్యాల ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన ద్విచక్ర వాహనాలను ఈ నెల 25న ఉదయం 10 గంటలకు వేలం వేయనున్నట్లు ప్రోహిబీషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గురవయ్య తెలిపారు. స్టేషన్ ఆవరణలో నిర్వహించే వేలంలో ఆసక్తి గల వారు పాల్గొనాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు స్టేషన్లో సంప్రదించాలని సూచించారు.
MBNR: జిల్లాలోని అన్ని ప్రభుత్వ, లోకల్ బాడీ, కేజీబీవీ, మోడల్ స్కూళ్లలో ఈ నెల 21న (రేపు) పేరెంట్-టీచర్ మీటింగ్ నిర్వహించాలని డీఈవో ఆదేశించారు. పరీక్షల నేపథ్యంలో పిల్లలకు ఇంటి వద్ద సహాయం ఎలా అందించాలన్న దానిపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించనున్నారు. ముఖ్యంగా 10వ తరగతి, అలాగే 2వ , 3వ తరగతి ఎఫ్ఎల్ఎన్/ ఎఫ్ఎల్ఎన్ పరీక్షల సిద్ధతపై దృష్టి పెట్టాలని అన్నారు.