HNK: హనుమకొండ నగరం లోని సర్క్యూట్ హౌస్లో అటవీశాఖ మంత్రి కొండా సురేఖను ఆదివారం పర్వతగిరి మండలం ఏనుగల్ గ్రామ సర్పంచ్ తొర్రి పద్మకుమార్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై మంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు.
PDPL: రామగుండం కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించి మేయర్గా మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్గా పాతపల్లి ఎల్లయ్య ఎన్నిక కావడంతో సింగరేణి కార్మికులు వారిని ఘనంగా సన్మానించారు. పారిశ్రామిక ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి అధిక మెజారిటీ అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. పట్టణ అభివృద్ధి, కార్మిక సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెడతామని పేర్కొన్నారు.
NLG: నల్లగొండలోని డాక్టర్స్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్కే హాస్పిటల్ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని అత్యాధునిక వైద్య సదుపాయాలను ఆయన పరిశీలించారు. సామాన్యులకు నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందించడంలో ప్రైవేట్ ఆసుపత్రులు ముందుండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మేయర్ బుర్రి చైతన్య పాల్గొన్నారు.
NZB: బుస్సాపూర్ గ్రామ శివారులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ధోనీ పోశెట్టి (56) అనే వ్యవసాయ కూలీ మృతి చెందారు. నిన్న సాయంత్రం పని ముగించుకుని భైక్పై వస్తుండగా, యూ-టర్న్ వద్ద నిర్మల్ నుంచి ఆర్మూర్ వెళ్తున్న బస్సు ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన పోశెట్టిని ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
SRCL: ఇల్లు లేని ప్రతి నిరుపేదకు ఇల్లు కట్టించి ఇస్తామని వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. రుద్రంగి మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో ఆదివారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఇల్లు లేని ప్రతి నిరుపేదకు ఇల్లు కట్టించి ఇవ్వడమే తమ లక్ష్యమని MLA అన్నారు.
భువనగిరి జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణకు కలెక్టర్ హనుమంతరావు కఠిన నిబంధనలు అమలులోకి తెచ్చారు. ఇకపై హెల్మెట్ లేని బైక్లకు పెట్రోల్ పోయకూడదని బంక్ యాజమాన్యాలను ఆదేశించారు. ప్రతి బంక్ వద్ద హెల్మెట్ ఆవశ్యకతపై అవగాహన బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ప్రజలు ట్రాఫిక్ నియమాలు పాటించాలని కోరారు.
మహబూబ్ నగర్ మున్సిపల్ తొలి మేయర్ గుమ్మడం మమత శ్రీనివాసను పలువురు నాయకులు మర్యాదపూర్వకంగా సన్మానించారు. మాజీ ఎంపీపీ లక్ష్మయ్య, బీసీ విద్యార్థి సంఘం నేత వెంకటేశ్ శాలువా, పూలమాలతో సత్కరించారు. పట్టణ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో కలిసి పని చేయాలని నేతలు చర్చించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
RR: పసిబిడ్డ మరణానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ జాగృతి ముస్లిం మైనారిటీ రాష్ట్ర అధ్యక్షులు ఎండి ముస్తఫా అన్నారు. SDNRలో వారు మాట్లాడుతూ.. కుమ్మెర మల్లన్న జాతరలో కుల వివక్షతో నిరుపేద రజక కుటుంబంపై జరిగిన దాడిలో పసిపాప మరణించడం అమానుషమని అన్నారు. జాతరకు రజక దంపతులు వెళ్ళగా, వారిపై దాడి చేయగా దాడిలో పాప ప్రాణాలు కోల్పోవడం విచారకరమని అన్నారు.
MNCL: కడెం మండలం దోస్త్ నగర్ గ్రామ సమీపంలో గల అటవీ ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కడెం వైపు నుంచి మంచిర్యాల వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొనగా ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని 108లో అంబులెన్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
KNR: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ 2 రోజుల సెలవుల అనంతరం సోమవారం పునః ప్రారంభం కానుంది. నిన్న, ఇవాళ సాధారణ సెలవులు కావడంతో మార్కెట్ బంద్ ఉంది. దీంతో రేపు మార్కెట్ ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరకులను తీసుకొచ్చి సరసమైన ధరలు పొందాలని అధికారులు సూచించారు. ఉదయం 9 గంటలలోపు మాత్రమే పత్తిని యార్డులోకి అధికారులు అనుమతించనున్నారు.
ADB: హైదరాబాద్లో ఈనెల 23 నుంచి 28 వరకు జరగనున్న ఆల్ ఇండియా పోలీస్ ఆక్వాటిక్ క్లస్టర్ పోటీలకు ఆదిలాబాద్ స్విమ్మింగ్ కోచ్ కృష్ణ సాంకేతిక నిపుణుడిగా ఎంపికయ్యారు. స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. జాతీయ స్థాయి పోటీల్లో కీలక బాధ్యతలు దక్కడంపై క్రీడా ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనను అభినందించారు.
మేడ్చల్: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ఎన్. రామచంద్రరావును బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా చేసిన అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని మేడ్చల్, మల్కాజిగిరి నియోజకవర్గం బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. పోలీస్ స్టేషన్ ముందు బైటాయించి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ.. తమ పార్టీ ఎమ్మెల్యేను పరామర్శించడానికి వెళ్లడం తప్పా అని ప్రశ్నించారు.
BDK: పాల్వంచ సుగుణ గార్డెన్స్లో ఆదివారం జరిగిన వివాహ రిసెప్షన్ వేడుకకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆయన సతీమణి మాధురి పాల్గొని నవ దంపతులను ఆశీర్వదించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు వూకంటి గోపాల్ రావు వాణి శ్రీ దంపతుల కుమారుడు సుమంత్, ప్రతాపనేని బుచ్చిబాబు -తనూజ దంపతుల కుమార్తె రేష్మి తలపై అక్షింతలు వేసి ఆశీర్వదించారు.
SDPT: ముదిరాజ్ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో జానపద గాయకుడు ఇట్టబోయిన స్వామి, కానిస్టేబుల్ దయ్యాల లక్ష్మణ్ను ఘనంగా సత్కరించారు. సోషల్ మీడియాలో ‘గుజారి’ పాటతో స్వామి 5 మిలియన్ల వ్యూస్ సాధించగా, బాడీ బిల్డింగ్లో లక్ష్మణ్ స్టేట్ సెకండ్ సాధించారు. ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలని రాష్ట్ర నాయకుడు జంగిటి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. వీరి విజయం సమాజానికి స్ఫూర్తిదాయకమన్నారు.
SRD: రీజనల్ రింగ్ రోడ్డు(RRR) ఉత్తర భాగం పనులకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్ నుంచి యాదాద్రి జిల్లా తంగడ్పల్లి వరకు 161.5 కి.మీల మేర 6వరుసల గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేగా దీనిని నిర్మించనున్నారు. ఈ రహదారికి ఎన్హెచ్-161AAగా నామకరణం చేస్తూ రూ.20,737 కోట్లు కేటాయించారు. త్వరలోనే పనులు ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు.