ADB: జిల్లా కేంద్రంలోని ఏరోడ్రమ్ ప్రాంతంలో ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్తో కలిసి ఎయిర్ పోర్ట్ మాస్టర్ ప్లాన్ను పరిశీలించారు. మాస్టర్ ప్లాన్కు అనుగుణంగా ఎన్ని ఎకరాలు ఎక్కడి వరకు ఎన్ని భూములు వెళ్తున్నాయో మ్యాప్ ఆధారంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ తాటిపళ్లి గంగాధర్ రావు, కౌన్సిలర్ జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.
MHBD: బయ్యారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రేపటి నుండి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కళాశాల ప్రిన్సిపల్ పర్యవేక్షణలో పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులను ఏర్పాటు చేశారు. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
NLG: మదర్ డెయిరీలో నెలకొన్న సమస్యలపై ఛైర్మన్ మధుసూదన్ రెడ్డి, డైరెక్టర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో MLAలు బీర్ల ఐలయ్య, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొని డెయిరీ ప్రస్తుత పరిస్థితిని సమీక్షించారు. డెయిరీ ఎదుర్కొంటున్న సవాళ్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
WNP: మైనర్ మానసిక వికలాంగురాలిపై జరిగిన అత్యాచార కేసులో నేరం రుజువవ్వడంతో నిందితునికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 25 వేల జరిమానా, కఠిన తీర్పునిచ్చినట్లు జిల్లా ఎస్పీ సునిత రెడ్డి తెలిపారు. ఇలాంటి కఠిన తీర్పులు సమాజానికి రక్షణ కవచం లాంటివి అన్నారు. ఏ అన్యాయం జరిగినా వెంటనే పోలీసులను సంప్రదించాలని ఎస్పీ సునీత రెడ్డి అన్నారు.
WGL: గీసుకొండ (M) కేంద్రంలోని గంగాదేవి పల్లె గ్రామంలో నల్లబెల్లి మండలానికి చెందిన సర్పంచుల కోసం నిర్వహిస్తున్న శిక్షణ శిబిరాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ డా. సత్య శారద సందర్శించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధిలో సర్పంచ్ పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో కృషి చేయాలని సర్పంచులను కోరారు.
JGL: రేపటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు, పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు, జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పేర్కొన్నారు. విద్యార్థులు ఆందోళనకు గురికాకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని సూచించారు. క్రమశిక్షణ, సమయపాలన పాటించి కేంద్రాలకు ముందుగానే చేరుకోవాలని, హాల్ టికెట్ వెంట తీసుకెళ్లాలని తెలిపారు.
KNR: అనుమతి లేకుండా మానేరు వాగు నుంచి ఇసుకను తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లను మగ్దుంపూర్ వద్ద విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే భారీ జరిమానాతో పాటు, పునరావృతమైతే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
WNP: రేవల్లి మండల తలుపునూరు గ్రామానికి చెందిన కౌసల్య అనారోగ్యంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స చేయించుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆమెకు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సహకారంతో CMRF మంజూరికి దరఖాస్తు చేసుకోగా రూ. 32 వేలు మంజూరయ్యాయి. మంజూరైన చెక్కును మంగళవారం ఎమ్మెల్యే వనపర్తిలోని తన నివాసంలో లబ్ధిదారులకు అందజేశారు.
RR: పల్లె ప్రగతిలో సర్పంచుల పాత్ర కీలకమని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ముచ్చింతల్ గ్రామ పరిధిలో ఉన్న స్వర్ణభారత్ ట్రస్టులో నిర్వహిస్తున్న రంగారెడ్డి జిల్లా సర్పంచుల శిక్షణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండి గ్రామస్తులకు సేవ చేస్తే మంచి పేరు వస్తుందని తెలిపారు.
HNK: జిల్లా కేంద్రంలోని అశోక థియేటర్ చౌరస్తాలో ఆటోమేటిక్ సిసి కెమెరాలను ఆర్టీసీ వరంగల్ టు డిపో అధికారులు మంగళవారం ప్రారంభించారు. అశోకా థియేటర్ చౌరస్తా మీదుగా వాహన రాకపోకలు సాగించేవారు. నిబంధనలను అతిక్రమిస్తే కెమెరాలు పసిగట్టి ఈ చాలాన్ ఇంటికి పంపించడం చేస్తాయి. వాహనదారులు నిబంధనలు పాటించాలని హెచ్చరిస్తున్నారు.
VKB: ఆలంపల్లికి చెందిన ప్రణీత్ అనే 9వ తరగతి విద్యార్థి మంగళవారం ఉదయం నుంచి కనిపించకుండా పోయాడు. స్కూల్కు వెళ్తున్నానని ఇంటి నుంచి బయలుదేరిన ప్రణీత్, పాఠశాలకు చేరుకోలేదు. బంధువులు, స్నేహితుల వద్ద విచారించినా ఫలితం లేకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎక్కడైనా కనిపిస్తే వెంటనే 98485 99876 నంబర్కు సమాచారం అందించాలని కోరారు.
NRML: పెంబి మండలంలోని మందపల్లి శివారులో ఎంపీ ఎస్సై హనుమాన్లు బుధవారం వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా ఓ ద్విచక్ర వాహనదారుడు సరైన అనుమతి పత్రాలు అన్ని సవ్యంగా ఉంచుకుని, హెల్మెట్ ధరించి వాహనం నడుపుతున్న వ్యక్తిని శాలువాతో సత్కరించారు. ప్రతి ఒక్క వాహనదారుడు ఇదే విధంగా రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ వాహనాలు నడపాలని సూచించారు.
MDK: అనారోగ్య కారణాలతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన కొల్చారంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. గ్రామానికి చెందిన ఎల్లమ్మ(49) కొంతకాలంగా షుగర్ వ్యాధితో బాధపడుతుంది. సోమవారం ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని వచ్చిన ఆమె మంగళవారం ఇంట్లో ఉరివేసుకుంది. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
BDK: బూర్గంపాడు మండలంలో ఇద్దరు ఎస్సైలు, వారి తండ్రిపై చీటింగ్ కేసు నమోదైంది. వ్యాపారం పేరుతో అధిక లాభాలు ఇస్తామని నమ్మించి గిరిజన మహిళ నుంచి రూ.1.82 కోట్లు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. డబ్బులు తిరిగి ఇవ్వకుండా, బెదిరింపులకు పాల్పడడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
JGL: వెల్గటూర్ మండల కేంద్రంలోని శ్రీరామ భక్తాంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఆలయ కమిటీ మంత్రిని కోరారు. ఆలయ ఛైర్మన్ మెరుగు నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో మంత్రిని కలిశారు. అన్నదానం, కళ్యాణ కార్యక్రమాల కోసం రెండు షెడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని మంత్రికి వినతి పత్రం అందజేశారు. ఆలయానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయాలన్నారు.