MDK: జిల్లాలో ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. రామాయంపేట సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్ పరీక్షల ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లావ్యాప్తంగా 28 ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు వివరించారు. సీసీటీవీ కెమెరాలు, త్రాగునీరు, విద్యుత్తు, మెడికల్ కిట్లు ఏర్పాటు చేశామన్నారు.
BDK: నూతనంగా ఎన్నికైన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్ను మంగళవారం ప్రకృతి ప్రేమికులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతి హరితదీక్ష ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. చిన్నతనం నుంచే మొక్కలు నాటడాన్ని అలవాటుగా చేసుకోవడం శుభపరిణామమని, నైనికను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు.
MHBD: ఆకేరు వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ సీజ్ చేసినట్లు పెద్దవంగర SI చిలువేరు ప్రమోద్ తెలిపారు. తొర్రూరు మండలంలోని బొంతుపల్లి తండాకు చెందిన గుగులోతు సురేష్ నెల్లికుదురు మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామంలోని ఆకేరు వాగు నుంచి పెద్దవంగర మండలానికి ఇసుక తరలిస్తున్న క్రమంలో సీజ్ చేసి,అతనిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
JN: పాలకుర్తి (M) కేంద్రంలోని గూడూరు గిరిజన బాలికల గురుకుల పాఠశాల & కళాశాలలో నిన్న జరిగిన సంఘటనపై గురుకులాల సెక్రటరీ, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇవాళ గురుకులాన్ని సందర్శించి విచారణ చేపట్టినట్లు DY సెక్రటరీ D.S వెంకన్న తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గురుకుల పాఠశాలలో భోజనం ఆలస్యం కావడం వలన విద్యార్థుల ధర్నా చేసినట్లు విచారణ తేలిందని తెలిపారు.
MDK: మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బాలగౌడ్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు బాల గౌడ్ ఇంటికి వెళ్లి తక్షణ సహాయంగా రూ. 10 వేల ఆర్థిక సహాయం అందజేశారు. బాలా గౌడ్ ఆరోగ్యం బాగుపడేందుకు మెరుగైన చికిత్స కోసం తోడ్పాటు అందిస్తామని కుటుంబానికి హామీ ఇచ్చారు.
WGL: ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో నిర్వహించనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని మంత్రి కొండా సురేఖకు అధికారులు, అర్చకులు ఆహ్వానం అందజేశారు. భక్తులకు సౌకర్యాల కల్పన, భద్రతా ఏర్పాట్ల విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని, దేవస్థానం అభివృద్ధి, భక్తుల సౌకర్యాల పెంపు కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు.
NGKL: రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో ప్రభుత్వ అధికారులదే కీలక పాత్ర అని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రూపొందించిన 2026 డైరీని అదనపు కలెక్టర్లతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గెజిటెడ్ ఉద్యోగుల సంఘం నాయకులు పాల్గొన్నారు.
JN: జిల్లాలోని రైతులు ఈ నెల 28వ తేదీలోపు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంబికా సోనీ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యవసాయ పథకాలు పొందేందుకు ఈ నమోదు అవసరమని స్పష్టం చేశారు. ఇంకా నమోదు చేసుకుని రైతులు ఏఈవోల వద్ద లేదా మీసేవ కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచించారు.
ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం ఇందిరా నగర్లో పేకాట స్తావరంపై మంగళవారం పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో గోలి వెంకటేష్, గడ్డం లక్ష్మణ్, గుర్లే రవీందర్ పట్టుబడగా మరో ఆరుగురు పరారయినట్లు తెలిపారు. సంఘటన స్థలంలో రూ. 12,040 స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పట్టుబడిన వారిని పోలీస్ స్టేషన్కి తరలించినట్లు SI వెంకట కృష్ణ పేర్కొన్నారు.
HNK: హన్మకొండలోని వాగ్డేవి కళాశాల విధ్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తూ “అరైవ్ అలైవ్” ఏర్పాటు చేశారు. CP సన్ ప్రీత్ సింగ్ హాజరై మాట్లాడుతూ.. వాహనదారుడు వాహనం నడిపేటప్పుడు తగు జాగ్రత్తలను తీసుకుంటూ వాహనం నడపాలని అన్నారు. అనంతరం ట్రాఫిక్ రూల్స్ పాటిస్తామంటూ విద్యార్థుల చేత ట్రాఫిక్ అధికారులు ప్రతిజ్ఞ చేయించారు.
MDCL: కూకట్పల్లి పరిధి గోపాల్ నగర్ ఏరియాల్లో అనుమతులకు మించిన నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని అక్కడికి ప్రజలు ఆరోపిస్తున్నారు. ఏకంగా జోనల్ కమిషనర్ అధికారికి రాతపూర్వకంగా ఫిర్యాదులు చేసిన పట్టించుకోలేదన్నారు. ఇంత జరుగుతుంటే అధికారులు ఎందుకు, నిర్లక్ష్యంగా ఉంటున్నారని ప్రశ్నించారు.
HNK: కలెక్టర్ కార్యాలయం ఎదుట డెస్క్ జర్నలిస్టులు మంగళవారం ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు మధు మాట్లాడుతూ.. గతంలో విధంగా డెస్క్ జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు మంజూరు చేశారో అదేవిధంగా కార్డులు మంజూరు చేసి జర్నలిస్టులకు న్యాయం చేయాలని కోరారు.
KMR: బీబీపేట మండల కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నాగర్ కర్నూల్ జిల్లాలో రజకులపై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని రజక సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
BHPL: జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఐడీవోసీ కార్యాలయంలో రెవెన్యూ, పోలీస్, మైనింగ్, టీజీ ఎండీసీ, పంచాయతీ రాజ్ శాఖల అధికారులతో ఇసుక అక్రమ రవాణా నియంత్రణ, ఇందిరమ్మ ఇళ్లుకు ఇసుక సరఫరా, కొడవటంచ దేవాలయ జాతర ఏర్పాట్లు, రైతులు యూరియా కొరకు యాప్ ద్వారా బుకింగ్ చేయుట తదితర అంశాలపై సమీక్షా నిర్వహించారు.
SRPT: చిలుకూరు మండలం సీతారాంపురం గ్రామంలో ఉపాధి హామీ నిధులతో నిర్మించిన గొర్రెలు, మేకల షెడ్లను, మంగళవారం సూర్యాపేట జిల్లా జడ్పీ ఇన్ఛార్జ్ సీఈవో శిరీష పరిశీలించారు. పనుల వివరాలను రికార్డుల్లో స్పష్టంగా నమోదు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం గ్రామంలోని నర్సరీని సందర్శించి మొక్కల రక్షణకు షెడ్ నెట్లు ఏర్పాటు చేయాలని సూచించారు.