నందమూరి తారకరత్న చివరి ప్రసంగం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. గత నెల 27వా తేదీన తెలుగు దేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం పాదయాత్రలో పాల్గొనేందుకు వచ్చారు తారకరత్న. ఆ సమయంలో అస్వస్థత ఏర్పడి హాస్పిటల్ కు తరలించారు. విషమంగా ఉండడంతో అక్కడి నుండి బెంగళూరు నారాయణ హృదయాలయకు తరలించారు. అక్కడ 23 రోజుల చికిత్స అనంతరం ఆయన కన్నుమూశారు. అయితే ఆయన చివరి ప్రసంగం ఇప్పుడు వైరల్ గా మారింది. మన...
నటుడు తారకరత్న నటుడిగా అంతగా నిలబడలేక పోయినప్పటికీ ఆయన కొన్ని పాటలు మాత్రం ఎందరినో అలరించాయి. ముఖ్యంగా నెంబర్ వన్ కుర్రాడు సినిమాలోని నువు చూడూ చూడకపో అనే పాట బాగా క్లిక్ అయింది.
తెలంగాణలోని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్నాయక్ 2,170 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటే అందులో 2,100 ఎకరాలు కబ్జా చేశారని వైఎస్సార్సీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆరోపించారు. ఇలాంటి కబ్జా అంశంపై ఏ పార్టీ నేతలు కూడా ప్రశ్నించలేదని..కానీ తాను అడిగినందుకు దాడులు చేయిస్తున్నారని పేర్కొన్నారు.
హైదరాబాద్ అంబర్ పేట పోలీస్ స్టేషన్ గ్రౌండ్ దగ్గర ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగార్థులు నిరసన చేపట్టారు. హైకోర్టు ఆదేశం ప్రకారం మ్యాన్యువల్ గా హైట్ చెక్ చేయకుండా మళ్లీ డిజిటల్ మీటరే ఉపయోగించి తమను డిస్ క్వాలిఫై చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మళ్లీ హైకోర్టును ఆశ్రయిస్తామని పేర్కొన్నారు. మరోవైపు లాంగ్ జంప్, షాట్ పుట్ కూడా ఎక్కువగా పెట్టి తమకు డిస్ క్వాలిఫై చేశారని ఇంకొంత మంది వాపోయారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ (contonment) బీఆర్ఎస్ (brs) ఎమ్మెల్యే సాయన్న కన్నుమూశారు. కొంత కాలంగా గుండె, కిడ్నీ వ్యాధితో బాధ పడుతున్న ఆయన యశోద హాస్పిటల్ లో తుది శ్వాస విడిచారు. ఆయన నాలుగు సార్లు కంటోన్మెంట్ నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. అంతకుముందు తెలుగు దేశం పార్టీ నుండి గెలిచిన ఆయన 2014 తర్వాత బి అర్ ఎస్ పార్టీలో చేరారు. 2018లో మరోసారి అదే పార్టీ నుండి విజయం సాధించారు.
పరామర్శ సమయంలో చంద్రబాబు వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో కూడా మాట్లాడుకోవడం ఆసక్తికరం. ఈ సందర్భంగా వారిద్దరూ కొద్దిసేపు మాట్లాడుకున్నారు. తారకరత్నకు అందించిన వైద్యం, అంత్యక్రియలు తదితర అంశాలపై మాట్లాడుకున్నట్లు తెలుస్తున్నది. విజయసాయిరెడ్డి తారకరత్న బంధువు. అందుకే దగ్గరుండి తారకరత్న కార్యక్రమాలు చూసుకుంటున్నారు.
తారకరత్నకు కుటుంబసభ్యులు, ప్రముఖులతో పాటు అభిమానులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు నివాళులర్పిస్తున్నారు. హైదరాబాద్ శివారులోని మోకిలలో ఉన్న తారకరత్న నివాసాలను ప్రజలు భారీగా తరలివస్తున్నారు. తారకరత్న మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఆ కుటుంబానికి సానుభూతి ప్రకటిస్తున్నారు.
వైఎస్ఆర్టీపీ(YSRTP) చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila)ను పోలీసులు అరెస్ట్ చేశారు. వైఎస్ షర్మిల(YS Sharmila) చేపడుతున్న పాదయాత్రను రద్దు చేసి ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
ఈ కుటుంబంలోని ముగ్గురు రోడ్డు ప్రమాదాల్లో (Road Accidents) దుర్మరణం పాలవగా.. అనారోగ్యంతో ఇద్దరు ఆకస్మిక మృతి చెందారు. ఇక మరికొందరు రోడ్డు ప్రమాదాల బారిన పడి త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఈ కుటుంబాన్ని యముడు వెంటపడుతున్నట్లు పరిస్థితి ఉంది. తాజాగా నందమూరి తారకరత్న మృతితో ఆ కుటుంబం తీరని విషాదంలో మునిగింది.
గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న హీరో నందమూరి తారకరత్న(Taraka Ratna) కన్నుముశారు. ఈ క్రమంలో బెంగళూరు(bangalore) నుంచి హైదరాబాద్(hyderabad)కు తీసుకొచ్చేందుకు అతని కుటుంబ సభ్యులు(family members) ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
కేసీఆర్ శివుడికే శఠగోపం పెట్టిండని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. వేములవాడ రాజన్న ఆలయానికి వస్తున్న లక్షల మంది భక్తలకు కనీస సౌకర్యాలు లేవని నిలదీశారు. ప్రతి సంవత్సరం ఈ ఆలయానికి 100 కోట్ల రూపాయలు ఇస్తానన్న మాటను కేసీఆర్ నిలబెట్టుకోలేదన్నారు.
శంషాబాద్ ఎయిర్ పోర్టుకు మెట్రో నిర్మాణం క్లిష్టమైన సమస్యగా మారిందని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చెబుతున్నారు. మెట్రోలైన్ నిర్మించే రాయదుర్గం స్టేషన్ నుంచి నానక్ రామ్ గూడ జంక్షన్ వరకు చేపట్టనున్న ఇంజినీరింగ్ వర్క్ ఇబ్బందిగా మారుతుందన్నారు. సుమారు 21 మీటర్ల ఎత్తులో మైండ్ స్పేస్ జంక్షన్ దాటడం కష్టతరమని అంటున్నారు. ఆ క్రమంలో ఫ్లై ఓవర్, అండర్ పాస్, మధ్యలో రోటరీ వంటివి అడ్డుగా ఉన్నాయని వెల్లడించారు.
errabelli dayakar rao:తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై (errabelli dayakar rao) భూ కబ్జా ఆరోపణలు వస్తున్నాయి. విపక్షాలు ఆయనను టార్గెట్ చేశాయి. తాను ఒక్క ఎకరం భూమి కబ్జా చేసినట్టు నిరూపిస్తే మంత్రి పదవీకి (resign) రాజీనామా చేస్తానని అన్నారు.