హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో జగన్మోహన్ రావు గెలుపొందారు. ప్రత్యర్థి అమర్ నాథ్పై 2 ఓట్ల తేడాతో జగన్మోహన్ రావు విజయం సాధించారు.
బీఆర్ఎస్, బీజేపీ, మజ్లిస్ ఒక్కటేనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం తనపై 24 కేసులు పెట్టిందని.. అదే తెలంగాణ సీఎం కేసీఆర్పై మాత్రం ఒక్క కేసు లేదని పేర్కొన్నారు.
తెలంగాణలో ఈసారి దసరా పండుగా సందర్భంగా సింగరేణి కార్మికులకు సంస్థ పెద్ద ఎత్తున బోనస్ ప్రకటించింది. ఏకంగా లక్షా 53 వేల రూపాయలను అనౌన్స్ చేసింది.
రాహుల్ గాంధీ అవినీతి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని మంత్రి కేటీఆర్ విమర్శించారు . ఆ పార్టీలో పీసీసీ పోస్ట్ కోసం రూ.50 కోట్లు తీసుకున్నారని గుర్తుచేశారు. ఈ విషయాన్ని సొంత పార్టీ ఎంపీ ఒకరు అన్నారని తెలిపారు.
కారును పోలిన గుర్తులను తొలగించాలని బీఆర్ఎస్ పార్టీ వేసిన పిటిషన్ని సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది.
ఓబీసీ కుల గణన ఎందుకు చేయడం లేదని కేంద్రాన్ని, రాష్ట్రాన్ని ప్రశ్నించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్కు వారి ఓట్లు కావాలే తప్ప.. ప్రయోజనాలు అక్కర్లేదని హాట్ కామెంట్స్ చేశారు.
ఉప్పల్ స్టేడియంలో సామగ్రి కొనుగోళ్ల అవకతవకలపై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ (Mohammad Azharuddin)పై ఉప్పల్ పోలీస్స్టేషన్లో మూడు, మాజీ కార్యదర్శి విజయానంద్, మాజీ కోశాధికారి సురేందర్ అగర్వాల్పై రెండు చొప్పున కేసులు నమోదయ్యాయి.హెచ్సీఏ (HCA) అధ్యక్షుడిగా అజారుద్దీన్ పని చేసిన 2019-2022 సమయంలో అగ్నిమాపక పరికరాలు, క్రికెట్ బంతులు, బకెట్ కుర...
క్షేత్ర స్థాయిలో బీఆర్ఎస్ ఫ్లాష్ సర్వేలు జరిపిస్తున్నట్టు తెలిసింది
యువజన సంఘాల నేత, తెలంగాణ ఉద్యమకారుడు, కాంగ్రెస్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి మళ్లీ సొంత గూటికి వెళ్తున్నట్లు తెలుస్తోంది.
బీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీ షాకివ్వనుంది. ఈసారి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి సిలిండర్ గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఓటర్లు ఓటు వేసే సమయంలో కొంత తికమకపడే అవకాశం ఉంది. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్కు తలనొప్పిగా మారే అవకాశం ఉంది.
హైదరాబాద్లో మీరు ఇల్లు కట్టుకోవాలని ఆలోచిస్తున్నారా? అయితే పర్మిషన్ కోసం లక్ష రూపాయలు రెడీ చేసుకోండి. అదెంటీ అనుమతి కోసమే అంత అమౌంట్ ఇవ్వాలా అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే తాజాగా సరూర్ నగర్ పరిధిలో ఓ అధికారి ఇదే విషయంలో లక్షన్నర లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.
తెలంగాణలో రాహుల్ గాంధీ బస్సు యాత్ర షెడ్యూల్లో మార్పులు జరిగాయి. ఈ క్రమంలో రేపు బోధన్, నిజామాబాద్లో జరగనున్న బస్సు యాత్రను క్యాన్సిల్ చేశారు. అయితే అత్యవసరంగా రాహుల్ ఢిల్లీ వెళ్లనున్న క్రమంలో ఈ మేరకు అనౌన్స్ చేశారు.
తెలంగాణలో కీలక కాంగ్రెస్ నేత రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. బైక్ ర్యాలీలో భాగంగా ఆమె పాల్గొన్న క్రమంలో స్కూటీ నుంచి కిందపడగా ఆమెకు గాయలయ్యాయి. దీంతో స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు.
నిన్నటి వరకు పారదర్శకంగా పనిచేస్తుందన్న టీఎస్పీఎస్సీ బోర్డును నేడు కేటీఆర్ ప్రక్షాళన చేస్తామని అంటున్నారు. ఇది కాదా దిగుజారుడు రాజకీయాలు అని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. నిరుద్యోగుల ఆగ్రహజ్వాలల్లోనే మీ ప్రభుత్వం మంట కలిసిపోతుందని, నిరుద్యోగ ద్రోహులుగా మీరు మిగిలిపోతారని షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. దేశంలోనే అవినీతి అంతా ఇక్కడే ఉందని భూపాలపల్లిలో నిర్వహించిన కాంగ్రెస్ బస్సు యాత్రలో రాహుల్ ఆరోపించారు. ఇంకా కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.