తెలంగాణలో వివిధ విద్యుత్తు సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్లపై ప్రభుత్వం అణిచివేత చర్యలను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో వేతనాలు పెంచాలంటూ సమ్మెలో పాల్గొన్న 200 మంది ఆర్టిజన్లను తొలగిస్తున్నట్లు(200 Artizens Dismiss) మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు మరికొందరు బుధవారం ఉదయంలోగా విధుల్లోకి రావాలని, లేని పక్షంలో వారిని కూడా విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరించింది.
తెలంగాణ(telangana)లో ధరణి పోర్టల్(dharani portal) వల్ల అనేక మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారని హైకోర్టు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పోర్టల్ వల్ల సమస్యలు తీరకపోగా..మధ్యవర్తులే(brokers) ఎక్కువగా లాభపడుతున్నారని వెల్లడించింది.
హైదరాబాద్(hyderabad)లో నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి(heavy rain) పలు చోట్ల పెద్ద ఎత్తున వరద ప్రవాహం చేరింది. మరోవైపు రోడ్లపై నీరు భారీగా చేరడంతో వాహనదారులు రోడ్లపై ప్రయాణించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. దీంతోపాటు లోతట్టు ప్రాంతాల్లోకి నీరు పెద్ద ఎత్తున చేరడంతో…ఆ ప్రాంతాల్లో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇంకోవైపు ఓ చిన్నారి కూడా మృత్యువాత చెందింది.
తన తాత, అమ్మమ్మలు దగ్గర్లో మసీదుకు తీసుకెళ్లి తాయత్తు కట్టించారని… ఆ తాయత్తు వల్లే తాను ప్రాణాలతో ఉన్నానని చెప్పారు. దీంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హెల్త్ డైరెక్టర్ గా(Director of Health) ఉండి డాక్టర్ల విశ్వాసం దెబ్బతినేలా ఈ వ్యాఖ్యలు ఏమిటని పలువురు విమర్శిస్తున్నారు.
వివేకా రాసినట్టుగా భావిస్తున్న లేఖ గురించి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. లేఖను సాయంత్రం వరకు ఎందుకు దాచిపెట్టారని ఆయనను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. వివేకా హత్య, తదనంతర పరిణామాల గురించి సీబీఐ (CBI) ఈ మేరకు వివరాలు సేకరిస్తోంది.
హైదరాబాద్లో(hyderabad) మరో నకిలీ నోట్ల ముఠాను పోలీసులు(police) చేధించారు. దీంతోపాటు 13 మంది అరెస్టు చేసి వారి నుంచి 30 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.
విద్యార్థులకు ఉపాధియే లక్ష్యంగా రాబోయే నూతన విద్యా సంవత్సరం 2023-24 నుంచి తెలంగాణ ఉన్నత విద్యామండలి సెక్టార్ స్కిల్ కోర్సులను (నైపుణ్య శిక్షణ కోర్సులు) అందుబాటులోకి తేనుంది.
నీళ్లు లేవు.. నిధులు లేవు.. నియమకాలు లేకుండా చేశారని. తెలంగాణకు సింగరేణి ఉద్యోగాల గని.. ఉమ్మడి రాష్ట్రంలోనే లక్ష 20 వేల ఉద్యోగాలున్న సింగరేణిలో ప్రస్తుతం 42 వేల ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయిని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క(CLP leader Bhatti Vikramarka) అన్నారు
ఓ మహిళా రైతు కన్నీరుమున్నీరుగా విలపించింది. కాళ్లు పట్టుకుని రోదించడం అందరినీ కలచివేసింది. తమను ఆదుకోవాలని ఎమ్మెల్యేను ప్రాధేయపడింది .తప్పకుండా ఆదుకుంటామని.. సీఎం కేసీఆర్ మీకు భరోసా ఇస్తారని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.