1500 మంది బృందాలు కష్టపడి పని చేశారు. 53 లక్షల మంది మహిళలు, 47 లక్షల మంది పురుషులు కంటి వెలుగు పరీక్షలు చేసుకున్నారు. 7 వేల గ్రామ పంచాయతీల్లో పరీక్షలు జరిగాయి.
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ అరెస్టై పైన ఆ పార్టీ లీగల్ సెల్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. హన్మకొండ కోర్టు విధించిన రిమాండును రద్దు చేయాలని కోరారు.
BJP MLA Rupjyoti Kurmi : తాజ్ మహల్ కూల్చేసి, ఆ స్థానంలో గుడి కట్టాలంటూ ఓ బీజేపీ ఎమ్మెల్యే డిమాండ్ చేశాడు. తాజ్ మహల్, కుతుబ్ మినార్ లను కూల్చివేయాలని అస్సోమ్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రుపియోటి కుర్మి డిమాండ్ చేశారు. అసలు షాజహాన్ తన భార్య ముంతాజ్ ని నిజంగానే ప్రేమించాడా అన్న దానిపై ‘దర్యాప్తు’ జరగాలని కూడా ఆయన కోరాడు.
సీపీఆర్ తో 23 రోజుల పసిపాపకు పునర్జన్మ దక్కడం తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు నిదర్శనంగా బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. సీపీఆర్ తో పాపను కాపాడిన వీడియో వైరల్ గా మారింది.
గతంలో రెండు సార్లు ప్రధాని పర్యటన వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఏం జరిగినా ఈసారి ప్రధాని పర్యటన తప్పక ఉండాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పట్టుబట్టారు.