WGL: ప్రమాదవశాత్తు చెట్టుకొమ్మతగిలి వ్యక్తికి తీవ్రగాయాలై చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. వర్ధన్నపేట మండలం కట్ర్యాల శివారులో జాతీయ రహదారిపై కడారిగూడెం గ్రామానికి చెందిన దోపతి రవీందర్ రెడ్డి అనే వ్యక్తి నిన్న ఇల్లంద గ్రామానికి వెళ్లి తిరిగి కడారిగూడెం వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అనంతరం అతడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందాడు.
WGL: వరంగల్ తూర్పు నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకురాలు పుష్పితలయ నేడు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాదులో కవితను కలిసి పూలబుకే అందజేసి, తూర్పు నియోజకవర్గంలో తాజా రాజకీయ పరిస్థితుల గురించి వివరించారు. నగరంలో పార్టీ బలోపేతానికి మరింత కృషిచేయాలని కవిత ఆమెకు సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పలువురు నాయకులున్నారు.
NGKL: హైదరాబాదులోని నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి నివాసంలో గురువారం పాలమూరు పీయూ ఉపకులపతి శ్రీనివాస్ కలిసి పీజీ సెంటర్ స్థాపన గురించి వినతి పత్రం అందజేశారు. యూనివర్సిటీలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను ఎంపీతో చర్చించారు. సానుకూలంగా స్పందిస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అనుమతులు వచ్చే విధంగా చూస్తానని స్పష్టమైన హామీ ఇచ్చారు.
MBNR: ఆమనగల్లు మండలంలో ఇప్పటివరకు గల ఏపీజీవీబీ పేరును 1జనవరి నుంచి నూతన సంవత్సరం నుంచి తెలంగాణ గ్రామీణ బ్యాంకుగా పేరు మార్చుతున్నట్లు మేనేజర్ తిరుపతి తెలిపారు. ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు ఖాతాదారులకు అన్ని రకాల సేవలు నిలిపివేస్తున్నట్లుగా తెలిపారు. జనవరి 1వ తేదీ నుంచి మళ్లీ ఖాతాదారులకు యథావిధిగా ధావిధిగా సేవలు అందిస్తామన్నారు.
WGL: జఫర్ గడ్ మండలంలోని కొనాయిచలం, తిడుగు గ్రామాల్లో బీజేపీ బూత్ కమిటీలను ఎన్నుకున్నారు. 255వ బూత్ అధ్యక్షుడిగా కాడబోయిన శ్రీనివాస్, 256వ బూత్ సింగరపు లింగమూర్తి, 257వ బూత్ అధ్యక్షుడిగా చందా రమేశ్, 258వ బూత్ వాసం రవి ఎన్నికయ్యారు. ఈ మేరకు వారికి మండల అధ్యక్షుడు నగేశ్ గౌడ్నియామక పత్రాలను అందజేసి పార్టీ బలోపేతానికి కష్టపడి పనిచేయాలని సూచించారు.
MNCL: దేశంలో జనాభాకు అనుగుణంగా బీసీలకు రిజర్వేషన్ కల్పించేందుకు రాజ్యాంగ సవరణ చేయాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గురువారం మంచిర్యాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగ సవరణ ద్వారా అగ్రవర్ణ కులాలకు రిజర్వేషన్ కల్పించిన కేంద్ర ప్రభుత్వం బీసీలకు కూడా రిజర్వేషన్లు కల్పించాలన్నారు.
NZB: మద్నూర్ మండలంలోని అంతాపూర్ గ్రామంలో నీటి సమస్య తీర్చినందుకు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతరావును గురువారం గ్రామస్థులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు శాలువాలతో సన్మానించారు. సమస్య పరిష్కారం కావడంతో హర్షం వ్యక్తం చేశారు. నాయకులు విఠల్, గ్రామ అధ్యక్షుడు దత్తు, మాజీ సర్పంచ్ రాజు, సంజు, బాలాజీ తదితరులున్నారు.
BDK: దమ్మపేట ఎమ్మార్వో కార్యాలయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈరోజు ఉదయం ఆకస్మికంగా సందర్శించారు. కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి పొంగులేటి సూచించారు. పనుల్లో అలసత్వం వహించవద్దన్నారు. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ వారి వెంట ఉన్నారు.
NLG: నల్గొండలో సీపీఐ వందేళ్ల వార్షికోత్సవాలు నిర్వహించారు. జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం ఎర్రజెండాను ఆవిష్కరించారు. శ్రమజీవుల సంక్షేమం కోసం, బడుగు బలహీన వర్గాల ప్రయోజనాల కోసం సీపీఐ నిరంతరం పోరాడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు మల్లెపల్లి ఆదిరెడ్డి, శ్రవణ్, పబ్బు వీరస్వామి, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.
NLG: భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాలోకి అడుగుపెడుతున్న సందర్భంగా పార్టీ శత ఉత్సవాలను జయప్రదం చేయాలని గురువారం దామరచర్ల కేంద్రంలోని సీపీఐ జెండాను నాయకులు కార్యకర్తలతో కలిసి మండల కార్యదర్శి ధీరావత్ లింగా నాయక్ ఎర్రజెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ప్రముఖులు బంటు వెంకటేశ్వర్లు, ఎండి సయ్యద్, డాక్టర్ వెంకన్న, వలపట్ల వెంకన్న, తదితరులున్నారు.
ఖమ్మం: ఖమ్మం-ఇల్లందు రూట్లో పాత లింగాల క్రాస్ రోడ్డు నుండి మర్రిగూడెం గ్రామ వరకు ధ్వంసమైన రోడ్డుకు మరమ్మతులు చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్ వి రాకేష్ ప్రభుత్వాన్ని ఆర్అండ్బీ అధికారులను గురువారం డిమాండ్ చేశారు. అనంతరం మాస్ లైన్ ఆధ్వర్యంలో మర్రిగూడెం ప్రాంతంలో రాస్తారోకో చేపట్టారు.
కామారెడ్డి: కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా ఇవ్వాలని కామారెడ్డి జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి చందూరి హన్మాండ్లు డిమాండ్ చేశారు. గురువారం బాన్సువాడ పట్టణంలో ఆయన మాట్లాడుతూ.. రైతు భరోసా రూ. 15000 గత సంవత్సరం ఇవ్వాల్సిన రూ. 2500తో కలిపి ఎకరానికి రూ.17500 చొప్పున చెల్లించాలని కోరారు.
మహబూబ్ నగర్: మరికల్ మండలం అప్పంపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ వెంకట్ రెడ్డి గురువారం బీజేపీలో చేరారు. ఆయనకు రాష్ట్ర నాయకులు నాగురావు నామాజి కాషాయం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీ పార్టీ విధానాలు, మోడీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీజేపీలో చేరినట్లు చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రతంగ్ పాండు రెడ్డి, జిల్లా అధ్యక్షుడు పాల్గొన్నారు.
వరంగల్: కాజీపేట మండలం మడికొండ చౌరస్తాలో గురువారం ద్విచక్ర వాహనదారుడిని టిప్పర్ లారీ ఢీకొట్టిన ఘటనలో ముచ్చర్ల గ్రామానికి చెందిన రాజేష్ అయ్యప్ప మాలదారుడి కుడికాలు మొత్తం నుజ్జు నుజ్జు అయింది. ప్రమాదం జరిగిన వెంటనే 108 ద్వారా మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మడికొండ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
NRML: నిర్మల్లోని బోయివాడ గురుద్వారలో వీర్ బాల్ దివస్ కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. సిక్కుల పదవ గురువైన గురు గోవింద్ సింగ్ కుమారులు సాహిబ్జాదా జోరావర్ సింగ్, సాహిబ్జాదా ఫతే సింగ్లకు నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వీర్ బాల్ ధైర్యసాహసాలు కొనియాడారు.