• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

తిప్పనగుల్లలో ఉపాధి హామీ పనులు ప్రారంభం

MDK: నిజాంపేట మండల తిప్పనగుల్ల గ్రామంలో సోమవారం గ్రామ సర్పంచ్ మంజుల రమేష్ల ఆధ్వర్యంలో ఉపాధి హామీ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ కూలీలకు 100 రోజుల పనులలో భాగంగా పనులు ప్రారంభించామన్నారు. ఈ అవకాశాన్ని ఉపాధి కోళ్లు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్, కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

February 23, 2026 / 12:17 PM IST

బొట్టుగూడ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్

NLG: నల్గొండ పట్టణం బొట్టుగూడలోని కోమటిరెడ్డి ప్రతిక్ రెడ్డి ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలను కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ సోమవారం ఉదయం సందర్శించారు. అన్ని తరగతి గదులను తిరుగుతూ పరిశీలన జరిపారు. 9వ తరగతి విద్యార్థులకు ఆయన గణితం బోధించి విద్యార్థులను ఆకట్టుకున్నారు. నాణ్యమైన విద్యను అందించాలని సిబ్బందికి సూచించారు.

February 23, 2026 / 12:16 PM IST

నేషనల్ హైవేపై రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలోని ఖానాపురం సమీపంలో నేషనల్ హైవే 365 రోడ్డుపై 2 బైకులు ఎదురెదురుగా ఢీకొనడంతో ఒక యువకుడికి తీవ్ర గాయాలు అయినట్లు ప్రయాణికులు తెలిపారు. గాయపడ్డ యువకుడిని వైద్య నిమిత్తం 108 అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తీసుకపోయినట్లు స్థానికులు పేర్కొన్నారు. సంఘటనపై ఎస్సై రవికుమార్ దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 23, 2026 / 12:15 PM IST

‘ప్రయోగ తరగతులకు తప్పని సరిగా హాజరుకావాలి’

MBNR: జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ సైన్స్, కంప్యూటర్ విద్యార్థులకు ప్రయోగ తరగతులు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. విద్యార్థులు కచ్చితంగా హాజరు కావాల్సిందేనని కోఆర్డినేటర్ డాక్టర్ జి. సత్యనారాయణ తెలిపారు. తప్పని సరిగా 80% హాజరు ఉండాలని తెలిపారు. 

February 23, 2026 / 12:12 PM IST

‘గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్ర కీలకం’

SDPT: కోహెడ మండల పరిషత్ కార్యాలయంలో వార్డు సభ్యుల రెండో విడత శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీవో కృష్ణయ్య కార్యక్రమాన్ని ప్రారంభించి, గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాల అమలు, పంచాయతీ విధులు, నిధుల వినియోగంపై అవగాహన కల్పించారు. కూరెళ్ల, మైసంపల్లి, నకిరేకొమ్ముల తదితర గ్రామాల సభ్యులు హాజరయ్యారు.

February 23, 2026 / 12:07 PM IST

ఆశా వర్కర్ల ముందస్తు అరెస్టు.. ‘చలో HYD’ భగ్నం..!

MDK: తమ న్యాయమైన డిమాండ్ల సాధనకై చేపట్టిన ‘చలో HYD’ కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. సోమవారం HYDకు తరలివెళ్తున్న ఆశా వర్కర్లను టేక్మల్ పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. గౌరవ వేతనం పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ వారు ఆందోళనకు సిద్ధమయ్యారు. పోలీసులు వారిని అడ్డుకుని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

February 23, 2026 / 12:05 PM IST

ఇంటర్ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్

GDWL: ఇంటర్ పరీక్షలు రాసేందుకు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతిపాదిత కళాశాలల కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు ఉండాలని జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ అన్నారు. ఈ నెల 25 నుంచి పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో సోమవారం గద్వాలలో ప్రభుత్వ మహిళ జూనియర్ కళాశాలల్లో పరీక్షల ఏర్పాటు కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు.

February 23, 2026 / 12:04 PM IST

‘ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేశాం’

MNCL: జన్నారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పరీక్షలను నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ చీఫ్ సూపర్డెంట్ బాపురావు తెలిపారు. సోమవారం వారు మాట్లాడుతూ.. బుధవారం నుండి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. మొదటి సంవత్సరంలో 125 మంది, రెండో సంవత్సరంలో 120 మంది మొత్తం 245 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.

February 23, 2026 / 12:03 PM IST

గుడిసె దగ్ధం.. ఎద్దు మృతి

NRPT: కావలి మల్లప్ప అనే రైతు మద్దూరు శివారు కాజీపురం రోడ్డులోని పొలం వద్ద 4 ఎద్దులను గుడిసెలో కట్టివేశాడు. దోమల బెడద తగ్గించేందుకు ఆదివారం మంట పెట్టి రాత్రి 9:30 గంటలకు ఇంటికి వెళ్లాడు. ఇదే సమయంలో గుడిసెకు మంటలు అంటుకుని పూర్తిగా దగ్ధమైంది. దీంతో గుడిసెలో ఉన్న 3 ఎద్దులు తాడు తెంచుకుని బయటపడగా, ఒక ఎద్దు అక్కడికక్కడే కాలిపోయి మృతిచెందింది. దీంతో రైతు కన్నీరుమున్నీరుగా విలపించాడు.

February 23, 2026 / 12:01 PM IST

అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది: MLA

NZB: రాష్ట్రంలో గిరిజన అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ధర్పల్లిలోని శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ ఆలయ ఐదవ వార్షికోత్సవం సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

February 23, 2026 / 12:01 PM IST

పోడు భూములపై గ్రామస్తుల వినతి

BDK: బూర్గంపహాడ్ మండలం, బట్టిగూడెం గ్రామంలో పోడు భూములపై ఆధారపడి జీవిస్తున్న ప్రజలు ఫారెస్ట్ అధికారుల చర్యలపై సోమవారం ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యను ఉప సర్పంచ్ భూక్య మోహన్ రావుకు తెలియజేయగా, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్ల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామ ప్రజలు తమ జీవనాధారాన్ని కాపాడాలని అధికారులను కోరుతున్నారు.

February 23, 2026 / 12:00 PM IST

మరికల్‌లో బీజేపీ నాయకుల నిరసన

NRPT: మరికల్ మండల కేంద్రంలో సోమవారం BJP మండల అధ్యక్షుడు మంగలి వేణుగోపాల్ ఆధ్వర్యంలో BJP నాయకులు నల్లబ్యార్జీలు ధరించి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణ రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు గుండా గురిని ఖండిస్తూ నిరసన తెలిపారు. మాజీ ఎమ్మెల్యే షబ్బీర్ అలీని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో కార్యకర్తలు ఉన్నారు.

February 23, 2026 / 11:48 AM IST

‘ఎల్లుండి నుంచి ఇంటర్ పరీక్షల ప్రారంభం’

MNCL: లక్షెట్టిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాటు చేశామని ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మణరావు అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ బుధవారం నుండి ఇంటర్ ప్రధమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. మొదటి సంవత్సరంలో 453, ద్వితీయ సంవత్సరంలో 211 మొత్తం 463 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని వివరించారు.

February 23, 2026 / 11:47 AM IST

జూనియర్ కళాశాల విద్యార్థినికి మెడల్

MNCL: జన్నారం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని ఎండి.అస్మా రాష్ట్రస్థాయి కరాటే పోటీలలో విజేతగా నిలిచారు. అస్మా రాష్ట్ర స్థాయిలో జరిగిన కరాటే పోటీలలో మూడో స్థానంలో సాధించారు. దీంతో నిర్వాహకులు ఆమెకు ట్రోఫీతో పాటు రూ.5000 నగదు బహుమతిని అందజేశారు. ఆమెను కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, అధ్యాపకులు అభినందించారు.

February 23, 2026 / 11:45 AM IST

ప్రారంభానికి ముందే మల్లంపల్లిలో ‘పల్లె దవాఖానా’ బేజారు

SDPT: అక్కన్నపేట(M) మల్లంపల్లిలో నిర్మించిన పల్లె దవాఖానా ప్రారంభానికి ముందే శిథిలావస్థకు చేరుకుంది. భవన నిర్మాణ పనులు పూర్తికాకముందే తలుపులు, కిటికీలు ఊడిపోయి భద్రతా సమస్యలు తలెత్తుతున్నాయి. తాగునీరు, మరుగుదొడ్లు వంటి కనీస వసతులు లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

February 23, 2026 / 11:45 AM IST