• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

తొమ్మిదే నెలల్లో ‘ఫ్యూచర్ సిటీ’ నైటౌట్

HYD: రేంజ్ మారిపోతోంది బాబోయ్! 765 చదరపు కిలోమీటర్ల భారీ విస్తీర్ణంలో రూపుదిద్దుకుంటున్న ‘ఫ్యూచర్ సిటీʼకి సర్కార్ డెడ్ లైన్ ఫిక్స్ చేసింది. కేవలం 9 నెలల్లోనే పూర్తిస్థాయి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని టెండర్‌లో స్పష్టం చేసింది. 56 గ్రామాలను కలుపుతూ గ్లోబల్ కంపెనీలు, యూనివర్సిటీలే లక్ష్యంగా ఈ నగరం నిర్మిస్తున్నారు.

February 28, 2026 / 01:34 PM IST

రైతుబంధుకు డబ్బులు లేవా సీఎం: హరీష్ రావు

SDPT: కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటుందని ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. జనగామలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఫూట్ బాల్ ఆడటానికి, విలాసవంతమైన కార్యాలయం కట్టుకోవడానికి పైసలు ఉంటాయి కానీ, రైతులకు రైతుబంధు ఇవ్వడానికి డబ్బులు లేవా అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.

February 28, 2026 / 01:34 PM IST

రాజ్యసభ రేసులో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే

NGKL: ఏఐసీసీ కార్యదర్శి, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి రాజ్యసభ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. జాతీయ స్థాయిలో పార్టీకి అందిస్తున్న సేవలను గుర్తించి ఆయనకు అవకాశం ఇవ్వాలని పలువురు నేతలు సీఎం రేవంత్ రెడ్డిపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. త్వరలో రాష్ట్రం నుంచి రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

February 28, 2026 / 01:33 PM IST

‘ఏటీడీవో కార్యాలయాలను తక్షణమే కలెక్టరేట్‌లోకి మార్చాలి’

ఖమ్మం జిల్లాలో ఉన్న గిరిజన అభివృద్ధి శాఖ (ఏటీడీవో) కార్యాలయాలను తక్షణమే కలెక్టరేట్‌ కార్యాలయంలోకి మార్చాలని PDSU జిల్లా అధ్యక్షులు గోకినపల్లి మస్తాన్ డిమాండ్ చేశారు. ఈమేరకు శనివారం ఆ శాఖ డిడి విజయలక్ష్మికి వినతి పత్రం అందజేశారు. జిల్లాలో 30 వసతిగృహాలు ఉండగా, ఏటీడీవోలు హాస్టళ్లను సందర్శించకుండా కేవలం కార్యాలయాలకే పరిమితమవుతున్నారని వివరించారు.

February 28, 2026 / 01:33 PM IST

గిరిజన భూములపై ఆక్రమణ ఆరోపణలు

BDK: అశ్వాపురం మండలం, ఆనందపురం గ్రామంలో గిరిజనులకు చెందిన 4 ఎకరాల భూమి ఆక్రమణకు గురైందని సర్పంచ్ ముర్రం సమ్మయ్య ఆరోపించారు. భూములపై ప్రశ్నించినందుకు తమపై కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారని తెలిపారు. రెవిన్యూ అధికారులు వెంటనే స్పందించి భూములను తిరిగి అప్పగించాలని డిమాండ్ చేశారు. అవసరమైతే ఉన్నతాధికారులను కలిసి న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు.

February 28, 2026 / 01:32 PM IST

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన పట్టణ కార్యదర్శి

HNK: పరకాల మున్సిపాలిటీ 20వ వార్డుకు చెందిన జీత్ కౌర్ ఇటీవల మరణించగా నేడు వారి కుటుంబ సభ్యులను బీజేపీ పరకాల పట్టణ కార్యదర్శి పాలకుర్తి తిరుపతి పరామర్శించి బియ్యం అందజేశారు. 20వ వార్డు పరిధిలోని ప్రజలకు అనునిత్యం అండగా ఉంటూ.. వారి సమస్యల పరిష్కారమే ప్రార్థన లక్ష్యంగా పనిచేస్తానని తిరుపతి తెలిపారు

February 28, 2026 / 01:32 PM IST

రోగులకు మెరుగైన వైద్య సేవలు: MRO

VKB: రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తహశీల్దార్ వెంకటేశ్ ప్రసాద్ ఆదేశించారు. శనివారం పెద్దేముల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రికి వచ్చే రోగులతో మర్యాదగా నడుచుకుంటూ వైద్య సేవలు అందించాలని తెలిపారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉండకుండా సేవలందించాలని సూచించారు.

February 28, 2026 / 01:32 PM IST

జిల్లాలో 98.11 శాతం ఇంటర్ హాజరు

కామారెడ్డి జిల్లావ్యాప్తంగా శనివారం జరిగిన ఇంటర్ పబ్లిక్ పరీక్ష ముగిసింది. మొత్తం 37 పరీక్షా కేంద్రాల్లో 7,840 మంది విద్యార్థులకు గాను 7,692 మంది హాజరయ్యారు. 148 మంది విద్యార్థులు గైర్హాజరు కాగా, జిల్లాలో సగటు హాజరు శాతం 98.11గా నమోదైందని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. అన్ని కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన నిఘా, మౌలిక వసతులు కల్పించారు.

February 28, 2026 / 01:31 PM IST

‘ప్రతి విద్యార్థి ఒక శాస్త్రవేత్తగా ఆలోచించాలి’

KNR: జిల్లా కేంద్రంలోని SRR ప్రభుత్వ కళాశాలలో శనివారం జాతీయ సైన్స్ దినోత్సవం పురస్కరించుకొని వృక్ష శాస్త్ర విభాగం ప్రొఫెసర్ డాక్టర్ పడాల మాట్లాడారు. మన దేశ శాస్త్రవేత్తలను గౌరవిస్తూ, మూఢనమ్మకాలను విడిచి శాస్త్రీయ దృక్పథంతో మెలుగుదామన్నారు. “వికసిత భారత్” కల సాకారం కావాలంటే ప్రతి విద్యార్థి ఒక చిన్న శాస్త్రవేత్తగా ఆలోచించాలని అన్నారు.

February 28, 2026 / 01:30 PM IST

వాజేడు MPDO కార్యాలయ సూపర్డెంట్ మృతి

MLG: వాజేడు MPDO కార్యాలయంలో సూపర్డెంట్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీధర ఉమారాణి (52) అనారోగ్యంతో శనివారం ఉదయం మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యా సమస్యలతో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఆమె స్వగృహంలోనే కన్నుమూశారు. ఆమె మృతి పట్ల ఎంపీడీవో, సంబంధిత అధికారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

February 28, 2026 / 01:30 PM IST

పౌర హక్కుల దినోత్సవం.. ప్రజల వద్దకే అధికారులు

SRPT: నేరేడుచర్ల మండలం వైకుంఠాపురం గ్రామంలో పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా శనివారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. బడుగు, బలహీన వర్గాల హక్కులకు భంగం కలగకుండా చూడటమే లక్ష్యంగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గ్రామస్తుల సమస్యలను వారి వద్దకే వెళ్లి తెలుసుకుని, తక్షణ పరిష్కారం చూపే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో సర్పంచ భవాని, అధికారులు పాల్గొన్నారు.

February 28, 2026 / 01:30 PM IST

పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన ఫ్లయింగ్ స్క్వాడ్

NRML: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలలో భాగంగా భైంసా పట్టణంలోని పలు పరీక్షా కేంద్రాలను శనివారం జిల్లా ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పరీక్షలను పారదర్శకంగా నిర్వహించే భాగంలో తనిఖీ నిర్వహించడం జరిగిందని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ తనిఖీలలో ప్లయింగ్ స్క్వాడ్ రవీందర్,డిఓ వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

February 28, 2026 / 01:27 PM IST

ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం

SRCL: చందుర్తి మండలం సనుగుల ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సివి రామన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు సందర్భంగా ఇన్ ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు గుర్రం మల్లారెడ్డి మాట్లాడుతూ .. భారతీయ భౌతిక శాస్త్రవేత్త సివి రామన్ 1928లో కనుగొన్న రామన్ ఎఫెక్ట్‌కు గౌరవంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని అన్నారు.

February 28, 2026 / 01:27 PM IST

గచ్చిబౌలి స్టేడియం ముందు అధ్వానం

HYD: అంతర్జాతీయ స్థాయి క్రీడలకు నిలయమైన గచ్చిబౌలి స్టేడియం ముఖద్వారం వద్దే అపరిశుభ్రత రాజ్యమేలుతోంది. స్టేడియం ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద వెలుస్తున్న అక్రమ ఫుడ్ స్టాల్స్ కారణంగా ఆ ప్రాంతమంతా అధ్వానంగా తయారవుతోంది. దీనిపై స్థానిక క్రీడాకారులు, నగరవాసులు సైబరాబాద్ పోలీసులకు, మున్సిపల్ అధికారులకు సామాజిక మాధ్యమాల వేదికగా ఫిర్యాదు చేస్తున్నారు.

February 28, 2026 / 01:26 PM IST

ఎస్సీ కమ్యూనిటి హాల్ నిర్మాణానికి భూమి పూజ

ADB: గుడిహత్నూర్ మండలంలోని ముత్నూర్ గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ హల్ నిర్మాణానికి ఇవాళ బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ భూమి పూజ చేశారు. ముత్నూర్ గ్రామస్తుల కోరికలను కచ్చితంగా నెరవేరుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జాదవ్ కరుణ భీంరావ్ నాయాక్. మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ తిరుమల్ ఉన్నారు.

February 28, 2026 / 01:22 PM IST