SRPT: ఖండాంతరాలు దాటిన ప్రేమ పెళ్లి పీటలెక్కింది. మేళ్లచెరువుకు చెందిన వరగాని రాజేశ్ సాఫ్ట్వేర్. ఉద్యోగ రీత్యా జపాన్ వెళ్లి, అక్కడ టోక్యోకు చెందిన వకానాతో ప్రేమలో పడ్డాడు. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో బుధవారం ఖమ్మంలో వీరు హిందూ సంప్రదాయ పద్ధతిలో ఘనంగా వివాహం చేసుకున్నారు. అయితే, విదేశీ వధువు మన సంస్కృతిలో మెరిసిపోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
HYD: అప్పటి GHMC యాప్, ఇప్పుడు My CURE యాప్ అయింది. ఈ యాప్ జీహెచ్ఎంసీ, మల్కాజ్గిరి, సైబరాబాద్ కార్పొరేషన్ల ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ, సేవలు అందించడానికి ఉపయోగించేలా రూపొందించారు. My CURE అంటే మై కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీగా ఈ పేరు పెట్టారు. మూడు కార్పొరేషన్ల ప్రజలు ఈ యాప్ యూజ్ చేసుకుని ఫిర్యాదు చేయాలని సూచించారు.
సూర్యాపేట: ఆపదలో ఉన్న వారికి అండగా ఉంటామని సూర్యాపేట పోలీసులు నిరూపించారు. దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గుడెల్లి రంగా వద్దకు ఎస్సై మహేంద్రనాథ్ స్వయంగా వెళ్లి వాంగ్మూలం నమోదు చేశారు. నిందితుడు లింగయ్యపై కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కాపీని అందజేశారు. స్టేషన్కు రాలేని స్థితిలో ఉన్న బాధితులకు తక్షణమే స్పందించి న్యాయం చేస్తామని ఎస్సై అన్నారు.
BDK: అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ రేపు దమ్మపేట మండలంలో పర్యటిస్తారని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఇన్ఛార్జి వట్టి వెంకట్రావు నేడు తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా ఎస్ హెచ్ జి భవన శంకుస్థాపన, జిపిఎస్ కాంపౌండ్ వాల్ శంకుస్థాపన, అంగన్వాడి భవనం ప్రారంభోత్సవం, సిసి రోడ్డు శంకుస్థాపన, మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవం కార్యక్రమాల్లో పాల్గొంటారన్నారు.
BHNG: యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం విశేష వేడుకలు జరగనున్నాయి. ఉదయం 9:30 గంటలకు మహా పూర్ణాహుతి, విష్ణు పుష్కరిణిలో చక్రతీర్థం మహోత్సవం నిర్వహించనున్నారు. రాత్రి 7:00 గంటలకు పుష్పయాగము, ద్వాదశి ఆరాధన, దేవతోద్వాసన, ధోపోత్సవం నిర్వహించనున్నారు. భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
MHBD: కొత్తగూడ మండలంలోని గుంజేడు ముసలమ్మ దేవాలయం వద్ద అటవీ శాఖ ఆధ్వర్యంలో కోటి రూపాయలు వ్యయంతో భక్తుల కోసం 5 వసతి గృహలు, కాటేజీలు, 10 షాపింగ్ కాంప్లెక్స్, వాటర్ ప్లాంట్లను ఏర్పాటుచేసారు. వీటిని మంత్రి సీతక్క గురువారం ప్రారంభించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వీటిని ఏర్పాటు చేశామని, సద్వినియోగపరుచుకోవాలని మంత్రి సూచించారు.
WNP: పాన్గల్ మండలం తెల్లరాళ్లపల్లి తాండాలో నూతనంగా నిర్మించిన శ్రీ శ్వేతాచల శ్రీనివాస స్వామి, ఆంజనేయ స్వామి విగ్రహాల ప్రతిష్టా మహోత్సవం గురువారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో, పాడిపంటలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు.
NZB: మెనూ ప్రకారం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని బిక్కనూర్ ఎంఈవో రాజగంగారెడ్డి ఆదేశించారు. గురువారం బస్వాపూర్ గ్రామంలోని రైతు వేదికలో వివిధ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాణ్యమైన భోజనం అందించకపోతే ఏజెన్సీలు రద్దు చేస్తామని హెచ్చరించారు.
NLG: చిట్యాల 1వ వార్డుకు చెందిన మాజీ విద్యా కమిటీ ఛైర్మన్ ఎడ్ల పద్మ, కాంగ్రెస్ నాయకుడు మహలింగం యాదవ్ దంపతులు మాజీ ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్ను ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించామని, దీనిపై విద్యాసాగర్ సానుకూలంగా స్పందిస్తూ.. నేను ఉన్నాను, అంటూ ధైర్యం చెప్పారని వారు పేర్కొన్నారు.
HNK: పరకాల పట్టణంలో వ్యవసాయ మార్కెట్లో ఆర్ఓ వాటర్ ప్లాంట్ నిర్మాణం, 5000 మెట్రిక్ టన్నుల గోదాం చుట్టూ సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. రైతులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు.
BHPL: నాలుగో వార్డులో ఇలాంటి బాధ్యత లేని కాంగ్రెస్ నాయకులు రవీందర్ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు పత్రాలను పంపిణీ చేయడం సరికాదని 4వ వార్డు కౌన్సిలర్ యుగంధర్ విమర్శించారు. గురువారం సాయంత్రం కౌన్సిలర్ మీడియాతో మాట్లాడారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు పంపిణీ చేయాల్సిన మంజూరు పత్తులను అర్హత లేని నాయకులు పంపిణీ చేయొద్దన్నారు. రవీందర్ పై చర్యలు తీసుకోవాలన్నారు.
BDK: క్రీడా స్ఫూర్తితో క్రీడాకారులు పోటీ పడుతూ విజయం సాధించేందుకు కృషి చేయాలని మణుగూరు ఎక్సైజ్ సీఐ రాజిరెడ్డి అన్నారు. గురువారం జర్నలిస్ట్ కప్ క్రికెట్ టోర్నమెంట్కు ముఖ్యఅతిథిగా హాజరై క్రీడాకారులను ఉత్సాహపరిచారు. పినపాక ప్రజాప్రతినిధులు, కరకగూడెం జర్నలిస్టులకు మధ్య జరిగిన మ్యాచ్లో కరకగూడెం జర్నలిస్టులు విజయం సాధించారు.
SRCL: ఆయిల్ పామ్ పంట సాగు ద్వారా అధిక దిగుబడితో పాటు దీర్ఘకాలంపాటు అధిక ఆదాయాన్ని పొందవచ్చని పంట సాగుకు రైతులు ముందుకు రావాలని కలెక్టర్ గరిమ అగర్వాల్ పిలుపునిచ్చారు. ఆయిల్ పామ్ సాగు, ఫర్టిలైజర్ యాప్, వ్యవసాయ యాంత్రీకీకరణ, రైతుల వివరాల నమోదు, క్రాప్ బుకింగ్ తదితర అంశాలపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
PDPL: పెద్దపల్లి మార్కెట్ యార్డులో గురువారం పత్తి విక్రయాలు సజావుగా జరిగాయి. కనిష్ట ధర రూ.5501, గరిష్ట ధర రూ.7468, మోడల్ ధర రూ.7121గా నమోదైంది. 1282 బస్తాల్లో 1371.74 క్వింటాళ్లు విక్రయానికి రాగా, 509 మంది రైతులు పాల్గొన్నారు. కొనుగోలు ప్రక్రియ ప్రశాంతంగా సాగిందని అధికారులు తెలిపారు.
BDK: మణుగూరు మండలం కూనవరం లో మజీద్-ఎ-బిలాల్ కమిటీ ఆధ్వర్యంలో పవిత్ర రమజాన్ మాసం సందర్భంగా నిర్వహించిన ఇఫ్తార్ విందులో పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముస్లిం సోదరులతో కలిసి ఉపవాస విరమణ చేసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసం సహనం, సేవా భావం, దయ, సౌభ్రాతృత్వానికీ ప్రతీక అని కొనియాడారు.