NZ: నవీపేట్ మండలం బినోల, నందిగాం శివారుల్లో గుర్తు తెలియని వ్యక్తులు పొలాల్లో అమర్చిన నాలుగు విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లను దొంగిలించారు. రైతులు మంగళవారం ఉదయం గమనించి వెంటనే విద్యుత్ అధికారులకు సమాచారం అందించారు. వారి ఫిర్యాదు మేరకు సీఐ శ్రీనివాస్, ఎస్సై శ్రీకాంత్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.
NLG: నాగర్ కర్నూల్ జిల్లాలో చాకలి మహిళపై దాడి, రెండు నెలల చిన్నారి మృతికి కారణమైన అమానుష ఘటనను నిరసిస్తూ మండలంలోని ఇర్కిగూడెంలో BC,SC,ST జేఏసీ ఆధ్వర్యంలో సంతాప సభ, కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. చిన్నారి మృతికి సంతాపం ప్రకటిస్తూ, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
SRCL: తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల నుంచి కంకర తరలిస్తున్న టిప్పర్ వాహనాన్ని సిరిసిల్ల అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పృథ్వీరాజ్ వర్మ పట్టుకున్నారు. మంగళవారం ఉదయం వాహనాల తనిఖీ సమయంలో నిబంధనలకు విరుద్ధంగా అధిక లోడుతో ప్రయాణిస్తున్న టిప్పర్ను గుర్తించి సిరిసిల్ల ఆర్టీసీ డిపోకు తరలించి సీజ్ చేశారు.
VKB: కొడంగల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుడు సోమ్లా NSS కంటింజెంట్ అధికారిగా, మరియు విద్యార్థి ప్రవీణ్ నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్కు ఎంపికయ్యారు. ఈరోజు నుంచి మార్చి 2 వరకు కర్ణాటకలో జరగనున్న ఈ శిబిరానికి వీరు వెళ్లనున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ బి.శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. పాలమూరు విశ్వవిద్యాలయం తరపున మొత్తం 10 మంది వాలంటీర్లు పాల్గొంటున్నారు.
RR: మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని, మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని వివిధ కాలనీల అధ్యక్షులు తమ కాలనీలలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి కార్యక్రమాల పై గతంలో వినతి పత్రాన్ని రాష్ట్ర TUFIDC ఛైర్మన్ చల్ల నరసింహ రెడ్డికి అందచేశారు. ఈరోజు జోనల్ కమీషనర్ చంద్రకళతో కలిసి కాలనీలో పర్యటించి, సమస్యలు తెలుసుకున్నారు. నాయకులు తదితరులు పాల్గొన్నారు.
GDWL: గద్వాల పాత కూరగాయల మార్కెట్ సమీపంలో మంగళవారం జరిగిన ప్రమాదంలో మేకపోతు అక్కడికక్కడే మృతి చెందగా, దాన్ని పట్టుకున్న వ్యక్తికి కూడా విద్యుత్ ఘాతంతో గాయాలయ్యాయి. రోడ్డుపై వేలాడుతున్న విద్యుత్ తీగలు లేదా షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతంలో ఇలా జరగడంతో ప్రజలు భయపడ్డారు.
MNCL: వ్యాధులతో బాధపడేవారు మందులను క్రమం తప్పకుండా వాడాలని జన్నారం ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది సూచించారు. ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ ఉమాశ్రీ ఆదేశాల మేరకు మంగళవారం రాంపూర్ గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు బీపీ, షుగర్ పరీక్షలను నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలన్నారు.
NRML: రేపటి నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను దృష్టిలో ఉంచుకుని జిల్లాలో కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా,పారదర్శకంగా జరిగేలా అన్ని 23 పరీక్షా కేంద్రాల వద్ద ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
KMM: పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ శ్రీశ్రీశ్రీ జగత్ మహామునీశ్వర స్వామి ఆశ్రమ పీఠాధిపతి బసవత్తుల రాజమౌళీశ్వర స్వామి రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రను నేడు కలిసి శాలువాతో సత్కరించారు. పాండవుల గుట్ట వద్ద ఉన్న ఆశ్రమంలో మార్చి 13 నుంచి 15వ తేదీ వరకు జరిగే అష్టోత్తర శతకుండ సహిత శతరుద్ర మాయాగానికి రావాలని ఎంపీకు ఆహ్వాన పత్రిక అందజేశారు.
NRPT: గుండుమాల్ మండలం ముదిరెడ్డిపల్లిలో 4, 5వ వార్డుల్లో సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజీ కాలువలు పనులు వేగంగా కొనసాగుతున్నాయి. సర్పంచ్ దేవమ్మ కృష్ణయ్య పనులను పరిశీలించి నాణ్యత పాటించాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో, తిరుపతి రెడ్డి చొరవతో అభివృద్ధి జరుగుతోందని తెలిపారు.
WGL: నెక్కొండ మాజీ ఎంపీటీసీ ఈదునూరి కరిష్మాను మంగళవారం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పరామర్శించారు. అనంతరం ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి కుటుంబానికి కాంగ్రెస్ అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యుడు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి, మార్కెట్ ఛైర్మన్ తదితరులు పాల్గొన్నారు.
MBMR: పాలమూరు యూనివర్సిటీ మహిళా క్రాస్ కంట్రీ జట్టు AIU యూనివర్సిటీ టోర్నమెంట్లో పాల్గొనడానికి మంగళూరు యూనివర్సిటీకి బయలుదేరింది. ఈ పోటీలు ఫిబ్రవరి 26-28 వరకు జరుగనున్నాయి. ఉపకులపతి ప్రో జి.ఎన్. శ్రీనివాస్ క్రీడాకారిణులకు ట్రాక్ షూట్లు, యూనిఫామ్లు అందజేసి జాతీయ స్థాయిలో రాణించి యూనివర్సిటీకి గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు.
MDCL: ఫిబ్రవరి 24 వరకు యూరియా నిల్వల పై ఫెర్టిలైజర్ యాప్ తాజా సమాచారం వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,71,041 యూరియా బ్యాగులు అందుబాటులో ఉన్నాయి. జిల్లాల వారీగా వికారాబాద్లో 10,991 బ్యాగులు, రంగారెడ్డిలో 16,809 బ్యాగులు, మేడ్చల్-మల్కాజ్గిరిలో 8,263 బ్యాగులు నిల్వలో ఉన్నాయని అధికారులు తెలిపారు. రైతులు అవసరమైన మేరకు బుక్ చేసుకోవాలని సూచించారు.
HYD: దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ నేడు కాచిగూడ రైల్వే స్టేషన్ను అధికారులతో కలిసి పరిశీలించారు. స్టేషన్ అభివృద్ధి ప్రణాళికలపై సమీక్షించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ డివిజన్ డీఆర్ఎమ్ సంతోష్ కుమార్ వర్మ జనరల్ మేనేజర్కు తోడుగా ఉన్నారు. ప్రయాణికుల సౌకర్యాల మెరుగుదలపై అధికారులు చర్చించారు.
NZB: ముబారక్ నగర్ కాంప్లెక్స్ పరిధిలో మంగళవారం నిజామాబాద్ గ్రామీణ మండలాల తెలుగు ఉపాధ్యాయులు రూపొందించిన బోధన అభ్యసన సామాగ్రి (TLM) ప్రదర్శన నిర్వహించారు. కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు హన్మంత్ రావు మాట్లాడుతూ.. విద్యార్థులకు పాఠ్యాంశాలు సులభంగా అర్థం కావడానికి టీఎల్ఎం ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు.