• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

నేటి నుంచే ఎల్.ఎల్.బి 5వ సెమిస్టర్ పరీక్షలు

NZB: తెలంగాణ యూనివర్సిటీలో ఎల్.ఎల్.బి 5వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య సంపత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 23, 25, 27 మార్చి 2, 4 తేదీల్లో మధ్యాహ్నం 2 గం.ల నుంచి సాయంత్రం 5 గం.ల వరకు పరీక్షలు వెల్లడించారు.

February 23, 2026 / 05:02 AM IST

ప్రతిష్టాత్మిక అవార్డు అందుకున్న మూసాపేట్ వాసి

HYD: కూకట్‌పల్లి మూసాపేట్ డివిజన్‌కు చెందిన కర్కనాగరాజుకు అత్యంత ప్రతిష్టాత్మికమైన వరల్డ్ అచివర్స్ అవార్డ్స్ 2026కు ఇటీవలే ఎంపికయారు. ఆదివారం న్యూఢిల్లీ జనక్ పూరి హోటల్ హయత్ సెంట్రిక్‌లో జరిగిన కార్యక్రమంలో భారత మాజీ క్రికెట్ ప్లేయర్ చేతన్ శర్మ చేతుల మీదుగా అవార్డ్‌ను అందుకున్నారు. సోషల్ సర్వీస్, ట్రేడ్ యూనియన్ లీడర్షిప్ కేటగియరీలో ఆయన ఎంపికయ్యారు.

February 22, 2026 / 09:43 PM IST

జనసేనలో పలువురి చేరిక

MDCL: కీసర(మం) దమ్మాయిగూడ డివిజన్ పరిధిలోని బండ్లగూడ ప్రాంతానికి చెందిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తల్లూరి ఆధ్వర్యంలో ఆదివారం సాంబశివరెడ్డితో పాటు ఆయన అనుచరులు, పలువురు జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ కండువా కప్పి ఘనస్వాగతం పలికారు. జనసేన సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ ఆశయాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు యువత ముందుకు రావాలన్నారు.

February 22, 2026 / 09:42 PM IST

ఇఫ్తార్ విందులో పాల్గొన్న MLA గాంధీ

RR: యూత్ కాలనీలో నిర్వహించిన ‘దవాత్-ఏ-ఇఫ్తార్’ కార్యక్రమంలో పీఏసీ ఛైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ముస్లిం సోదరులతో కలిసి విందు ఆరగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రంజాన్ క్రమశిక్షణకు, మత సామరస్యానికి ప్రతీక అని, తెలంగాణలో “గంగా జమునా తెహజీబ్” సంస్కృతిని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.

February 22, 2026 / 09:39 PM IST

హుజూర్‌నగర్ 21వ వార్డులో క్షేత్రస్థాయి పరిశీలన

NLG: హుజూర్‌నగర్ మున్సిపాలిటీ 21వ వార్డులో చైర్మన్, వైస్ చైర్మన్, కమిషనర్ ఆధ్వర్యంలో అధికారులు క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించారు. డ్రైనేజ్, వీధి దీపాలు, శానిటేషన్, వాటర్ సప్లై సమస్యలను పరిశీలించి ప్రజల అభ్యర్థనలు నమోదు చేశారు. అభివృద్ధి పనులు చేపడతామని, మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తామని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

February 22, 2026 / 09:38 PM IST

ప్రతిభను వెలికి తీయడానికే టాలెంట్టెస్ట్

BHNG: ఆలేరులో SFI మండల కమిటీ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా SFI జిల్లా కార్యదర్శి రాజు మాట్లాడుతూ.. విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకే ఈ పోటీలని తెలిపారు. పదో తరగతి విద్యార్థులు మానసిక ఒత్తిడి లేకుండా వార్షిక పరీక్షలు రాయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో UTF నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

February 22, 2026 / 09:32 PM IST

వెంకటాయపల్లి నేతలు కాంగ్రెస్‌లో చేరిక

MBNR: ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రభావంతో వెంకటాయపల్లి స్వతంత్ర సర్పంచ్ రామాంజనేయులు, ఉపసర్పంచ్ పింజరి మోహన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి కండువా కప్పి వారిని ఆహ్వానించారు. అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని.. అందుకే ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్‌లో చేరుతున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

February 22, 2026 / 09:31 PM IST

నిజాంపేట ప్రజావాణికి కలెక్టర్ హాజరు

MDK: నిజాంపేట మండల కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయంలో రేపు జరిగే ప్రజావాణి కార్యక్రమానికి హాజరు అవుతున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. నిజాంపేట మండల కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయంలో సోమవారం జరగనున్న ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రత్యక్షంగా హాజరుకానున్నారు. నేరుగా ప్రజల పిర్యాదులు స్వీకరించనున్నారు.

February 22, 2026 / 09:21 PM IST

‘మానవత్వం లేని రెడ్డిలపై చర్యలు తీసుకోవాలి’

SRD: మానవత్వం లేని రెడ్డి లపై చర్యలు తీసుకోవాలని KVPS జిల్లా సహాయ కార్యదర్శి గణపతి డిమాండ్ చేశారు. నేడు ఖేడ్‌లో ఆయన మాట్లాడుతూ.. నాగర్ కర్నూల్ జిల్లా కమ్మేర మల్లన్న గుడిలోకి చాకలి చంద్రకళను స్థానిక రెడ్డిలు రానివ్వక పోవడంతో, ఆమె తమ్ముడు నిలదీయగా, ఆయనను చితకబాదారన్నారు. దీంతో ఇరువర్గాల మధ్య నెలకొన్న ఘర్షణలో 2నెలల పసికందును కాలితో నలిపి వేయడం దారుణమన్నారు.

February 22, 2026 / 09:13 PM IST

విజేతలకు బహుమతులు అందజేసిన మున్సిపల్ చైర్మన్

WNP: గత మూడు రోజులుగా జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి సుధీర్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సీఎం కప్ సెకండ్ ఎడిషన్ క్రీడా పోటీలో నిర్వహించారు. వనపర్తి పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహిస్తున్న సేపక్ తక్రా రాష్ట్ర స్థాయి క్రీడ పోటీలలో పురుషుల విభాగంలో హైదరాబాద్ ప్రధమ స్థానంలో నిలిచాయి. విజేతలకు మున్సిపల్ చైర్మన్ మాధవి రమేష్ చేతుల మీదిగా బహుమతులు అందజేశారు.

February 22, 2026 / 09:11 PM IST

అనుమానాస్పదంగా యువతి మృతి

MDCL: అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధి సూర్య నగర్‌లోని వీవీ స్విమ్మింగ్ పూల్‌లో ఈత నేర్చుకోవడానికి వచ్చిన ఇంటర్ చదివే అమ్మాయి అనుమానాస్పదంగా మృతి చెందింది. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని అల్వాల్ పోలీసులు వెల్లడించారు.

February 22, 2026 / 09:05 PM IST

ముగిసిన రాష్ట్ర స్థాయి సైక్లింగ్ పోటీలు

SDPT: చిన్నకోడూర్ మండలం చంద్లపూర్ రంగనాయక సాగర్ ప్రాజెక్టుపై రెండు రోజుల పాటు సాగిన ‘సీఎం కప్’ రాష్ట్ర స్థాయి సైక్లింగ్ పోటీలు ఆదివారం ముగిశాయి. జిల్లా యువజన క్రీడల అధికారి వెంకటనర్సయ్య పాల్గొని విజేతలకు మెడల్స్, సర్టిఫికెట్లు అందజేశారు. నైపుణ్యం గల క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించేందుకు ఇలాంటి పోటీలు ఎంతగానో దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.

February 22, 2026 / 09:00 PM IST

‘గ్రామస్థాయిలో సేవాలాల్ జయంతి నిర్వహించాలి’

BDK: ఇల్లందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం బంజారా సర్పంచ్లతో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. ఈనెల 28న నియోజకవర్గంలో సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకను అధికారికంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. గ్రామ స్థాయిలో కూడా జయంతిని నిర్వహించాలని కోరారు.

February 22, 2026 / 08:58 PM IST

వెంటనే ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి: అధికారులు

BHPL: రేగొండ మండలంలోని అన్ని గ్రామాల్లో ఇప్పటి వరకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకుని రైతులు వెంటనే ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. రిజిస్ట్రేషన్ చేసుకుంటే మాత్రమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు, సబ్సిడీలకు అర్హత పొందుతారని పేర్కొన్నారు. ఆలస్యం చేయకుండా సంబంధిత AEO వద్దకు వెళ్లి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలన్నారు.

February 22, 2026 / 08:55 PM IST

ప్రశాంతంగా గురుకులాల కామన్ ఎంట్రన్స్ టెస్ట్

ADB: ఇంద్రవెల్లి మండలం పాటగూడలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో ఆదివారం నిర్వహించిన తెలంగాణ గురుకులాల కామన్ ఎంట్రన్స్ టెస్టు ప్రశాంతంగా జరిగింది. ఈ సందర్భంగా పరీక్ష కేంద్రం వద్ద విద్యార్థుల కోసం అన్ని ఏర్పాట్లు చేపట్టారు. ఈ పరీక్షకు విద్యార్థులు 219 మంది విద్యార్థులు హాజరైనట్లు.. 21 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు.

February 22, 2026 / 08:55 PM IST