• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం

NLG: దేవరకొండ ఆర్టీసీ వెల్ఫేర్ కమిటీ మెంబర్ పాపారాజు, కార్మికులు కలిసి వారి సమస్యల గురించి ఎమ్మెల్సీ కోదండరామ్‌కు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఆర్టీసీ కార్మికుల తరుపున సీఎం రేవంత్ రెడ్డి, రవాణా శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. పూర్తి స్థాయిలో వారి సమస్యలను విని కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

February 25, 2026 / 04:02 PM IST

సిరిసిల్ల జిల్లాలో 119 మంది గైర్హాజరు

SRCL: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలకు తొలి రోజు 4209 మంది విద్యార్థులు హాజరైనట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. జిల్లాలోని 16 పరీక్ష కేంద్రాలలో నిర్వహించిన తొలి రోజు పరీక్షలో 4046 మంది రెగ్యులర్, 283 మంది ప్రైవేటు విద్యార్థులు కలిపి 4328 మంది విద్యార్థులకు గాను, 4209 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారన్నారు. అలాగే 119 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు.

February 25, 2026 / 04:02 PM IST

సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి: కలెక్టర్

ADB: విద్యార్థులు ప్రాథమిక దశ నుంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. బుధవారం పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఆశ్రమ పాఠశాలలో ధ్యేయ లెర్నింగ్ సొల్యూషన్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న లెర్న్ స్మార్ట్ విత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీంతో విద్యార్థులకు కంప్యూటర్ జ్ఞానం పెరగడంతో పాటు విషయ పరిజ్ఞానం సైతం పెరుగుతుందన్నారు.

February 25, 2026 / 04:02 PM IST

మార్చి 28కి జాతీయ లోక్ అదాలత్ వాయిదా

ADB: జిల్లాలో మార్చి 14న జరగాల్సిన జాతీయ లోక్ అదాలత్ అదే నెల 28వ తేదీకి వాయిదా పడినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు వెల్లడించారు. అదనంగా లభించిన ఈ రెండు వారాల సమయాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. మార్చి 28న జరిగే అదాలత్లో పెద్ద సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యేలా చూడాలని కోరారు.

February 25, 2026 / 04:02 PM IST

మంత్రిపై దాడి బాల్క సుమన్ అహంకారానికి నిదర్శనం

MNCL: మంత్రి వివేక్ పై BRS నాయకుల తీరును చెన్నూర్ కాంగ్రెస్ నాయకులు తప్పుబట్టారు. క్యాతన్పల్లి ఘటనలో మంత్రిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు.ప్రజాస్వామ్య బద్ధంగా ఓటు వేయడానికి వెళ్లిన మంత్రిపై దాడికి పాల్పడటం బాల్క సుమన్ అహంకారానికి నిదర్శనమన్నారు. తప్పు చేసి మంత్రిపైనే విమర్శలు చేయడం సరికాదని, BRS నేతలు తమ వైఖరి మార్చుకోవాలని హితవు పలికారు.

February 25, 2026 / 04:01 PM IST

ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ

నల్గొండ కార్పొరేషన్ పరిధిలోని 20వ డివిజన్ పెద్ద బండలో బుధవారం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను ఆ డివిజన్ కార్పొరేటర్ అల్లి సుభాష్ యాదవ్ అందజేశారు. ప్రతి పేదవాడికి సొంత ఇంటి కలను నిజం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని ఆయన అన్నారు. సీఎం రేవంత్, మంత్రి వెంకట్ రెడ్డి సహకారంతో డివిజన్‌ను అన్ని విధాల అభివృద్ధి చేస్తానన్నారు.

February 25, 2026 / 03:57 PM IST

పంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ

NGKL: బల్మూర్ మండలం మంగలికుంటపల్లి గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణానికి కాంగ్రెస్ నాయకులు భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్ రెడ్డి వెంకట్ రెడ్డి, గ్రామ సర్పంచ్ వెంకటయ్య యాదవ్ పనులు ప్రారంభించారు. పంచాయతీ భవనానికి స్థలాన్ని విరాళంగా ఇచ్చిన వెంకటేశ్వరరావు, కృష్ణ రావులను ఈ సందర్భంగా నాయకులు అభినందించారు.

February 25, 2026 / 03:52 PM IST

కుమ్మర మల్లన్న జాతర ఘటన సిగ్గుచేటు

MDK: కుమ్మెర మల్లన్న జాతరలో కుల వివక్షతో నిరుపేద రజక కుటుంబంపై జరిగిన దాడిలో పసిపాప మరణించడం అమానుషం అని బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండించింది. చేగుంటలో నిరసన వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటన సభ్య సమాజానికి సిగ్గుచేటని ఘటనకు పాల్పడ్డ వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని చేగుంట మండలం ఉప సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు మొహమ్మద్ రఫీ అన్నారు.

February 25, 2026 / 03:52 PM IST

గోపలాయపల్లి గుట్టపై వైభవంగా సుదర్శన హోమం

NLG: నార్కట్ పల్లి మండలం, గోపలాయపల్లి గుట్టపై శ్రీ వారిజాల వేణు గోపాలస్వామి ఆలయంలో బుధవారం సుదర్శన హోమాన్ని వేద పండితులు వైభవంగా నిర్వహించారు. ప్రతి నెల రోహిణి నక్షత్రం సందర్భంగా గుట్టపై హోమాన్ని నిర్వహిస్తారు. పలువురు దంపతులు సాంప్రదాయ దుస్తులు ధరించి హోమంలో పాల్గొన్నారు. భక్తులు విచ్చేసి హోమాన్ని తిలకించారు. అనంతరం అన్న ప్రసాద వితరణ జరిపారు.

February 25, 2026 / 03:51 PM IST

ఆర్థిక అక్షరాస్యత కేంద్రం ఆధ్వర్యంలో అవగాహన

SDPT: అక్కన్నపేట మండలంలోని జనగామలో ఆర్థిక అక్షరాస్య త కేంద్రం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరిగింది. ఆర్థిక అక్షరాస్యత ప్రాముఖ్యత, సైబర్ నేరాల నివారణ, బ్యాంకింగ్ సేవలపై వివరించారు. KYC, e-KYC, CKYC, డిజిటల్ KYC ప్రక్రియలపై అవగాహన కల్పించారు. సర్పంచ్ చందు లక్ష్మి, సెక్రటరీ మహేందర్, యూనియన్ బ్యాంక్ మేనేజర్ సంజయ్ కుమార్, ఫీల్డ్ అసిస్టెంట్ తదితరులు పాల్గొన్నారు.

February 25, 2026 / 03:48 PM IST

ప్రమాదకరంగా మారిన కట్టె విద్యుత్ స్తంభాలు

MNCL: జన్నారం మండలం కవ్వాల్ హాస్టల్ తండాలోని కట్టె స్తంభాలు, ఈదురు గాలులకు ఒక పక్కకు ఒరిగిపోయాయి. ఎనిమిదేళ్లుగా ఈ సమస్య వేధిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. పొలాలకు వెళ్లే మార్గంలో ప్రాణాపాయం పొంచి ఉందని, తక్షణమే స్పందించి శాశ్వత సిమెంట్ స్తంభాలను ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

February 25, 2026 / 03:46 PM IST

ప్రశాంతంగా ముగిసిన తొలి ప్రరీక్ష

MDCL: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బుధవారం ఉదయం 9 గంటల నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. అల్వాల్‌లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు సకాలంలో హాజరయ్యారు. శ్రీ చైతన్య, నారాయణ, వైభవ్ , లయోలా తదితర కాలేజీల్లో పరీక్షలు నిర్వహించగా, కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంతో మొదటి రోజు పరిక్ష ప్రశాంతంగా ముగిసింది.

February 25, 2026 / 03:44 PM IST

ఇంటర్ పరీక్షా కేంద్రాలు పరిశీలించిన ఎస్పీ

SRD: సంగారెడ్డి పట్టణంలోని ఇంటర్ పరీక్ష కేంద్రాలను ఎస్పీ పారితోష్ పంకజ్ బుధవారం తనిఖీ చేశారు. పరీక్షలు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. ఆయన వెంట కళాశాల ప్రిన్సిపల్ ఉన్నారు.

February 25, 2026 / 03:42 PM IST

తండాల సమగ్రాభివృద్ధికి ప్రత్యేక చర్యలు: MLA

JN: తండాల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. రఘునాథపల్లి మండలంలోని పలు తండాలలో ఎమ్మెల్యే పర్యటించి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. గతంలో అధికారంలో ఉన్న వారు తండాలను పట్టించుకోలేదని, తండాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నామన్నారు.

February 25, 2026 / 03:40 PM IST

గ్రామాల అభివృద్ధిలో GP పాత్ర కీలకం: ఆడే గజేందర్

ADB: గ్రామాల అభివృద్ధిలో గ్రామపంచాయతీ పాత్ర కీలకమని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ ఆడే గజేందర్ అన్నారు. బుధవారం మండలంలోని సాంగ్వి గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి స్థానికులతో కలిసి భూమి పూజ కార్యక్రమం చేపట్టారు. గ్రామ పంచాయతీలోనే గ్రామాల అభివృద్ధి చర్చ జరుగుతుందని పేర్కొన్నారు. మండల నాయకులు, మహిళలు తదితరులున్నారు.

February 25, 2026 / 03:40 PM IST