• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

CC రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన : MLA

WGL: ఖానాపురం(M) బుధరావుపేట గ్రామంలో ఇవాళ అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి శనివారం MLA దొంతి మాధవరెడ్డి శంకుస్థాపన చేశారు. MLA మాట్లాడుతూ.. మహిళల సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. మహిళా సంఘాలకు ఐదేళ్లలో లక్ష కోట్ల రుణాలు ఇవ్వాలనే లక్ష్యంతో మొదటి ఏడాదిలోనే రూ.21,600 కోట్ల వడ్డీ లేని రుణాలు అందజేశామని తెలిపారు.

February 21, 2026 / 05:23 PM IST

నాటుసారా కేంద్రంపై దాడులు.. ఐదుగురు అరెస్ట్

HYD: పల్లెచలుక తండాలో నాటుసారా తయారీ కేంద్రంపై ఎన్ ఫోర్స్ మెంట్, సరూర్ నగర్ డీటీఎఫ్, అమనగల్ ఎక్సైజ్ సిబ్బంది ఈఎస్ జీవన్ కిరణ్ ఆధ్వర్యంలో అధికారులు దాడులు చేశారు. 8 లీటర్ల నాటుసారా, 580 లీటర్ల బెల్లం పానాకం ధ్వంసం చేశారు. ఇస్లావత్ హిరియా సహా ఐదుగురిని అరెస్ట్ చేసి, మరో నలుగురిపై కేసులు నమోదు చేసి గాలిస్తున్నారు.

February 21, 2026 / 05:21 PM IST

యథావిధిగా ప్రజావాణి కార్యక్రమం ప్రారంభం: కలెక్టర్

SRD: జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తాత్కాలికంగా నిలిపివేసిన ప్రజావాణి కార్యక్రమాన్ని ఫిబ్రవరి 23 (సోమవారం) నుంచి యథావిధిగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యల పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొనాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

February 21, 2026 / 05:20 PM IST

‘విద్యా విహారాలు.. పరిశోధనాసక్తి పెంపొందిస్తాయి’

SDPT: సిద్ధిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని బయోటెక్నాలజీ, రసాయన శాస్త్ర విభాగాల విద్యార్థులకు ప్రాయోగిక జ్ఞానం అందించేందుకు హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ ఆధ్వర్యంలో శనివారం ఫీల్డ్ ట్రిప్ నిర్వహించారు. ఈ విద్యా విహారాలు విద్యార్థులలో పరిశోధనాసక్తిని పెంపొందిస్తాయని కాలేజ్ ప్రిన్సిపాల్ డా జి. సునీత తెలిపారు. నిర్వాహకులను ఆమె అభినందించారు.

February 21, 2026 / 05:20 PM IST

సేవ చేయడం గొప్ప లక్షణం: ఎమ్మెల్యే

BDK: ఇల్లందు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్వర్యంలో శనివారం నిర్వహించిన NSS స్పెషల్ క్యాంప్‌కు ఎమ్మెల్యే కోరం కనకయ్య హాజరయ్యారు. సేవ చేయడం గొప్ప లక్షణం విద్యార్థి దశనుంచే సేవలు చేసే గుణం అలవర్చుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. బొజ్జాయిగూడెం గ్రామంలో ఎన్ఎస్ఎస్ క్యాంప్ నిర్వహించడం గొప్ప విషయమని కొనియాడారు.

February 21, 2026 / 05:09 PM IST

రేపు జిల్లాకు రానున్న CM

MLG: CM రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని ములుగు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నాగమణి అన్నారు. ఇవాళ జిల్లా కేంద్రంలో ఆమె మాట్లాడుతూ.. రేపు ఉదయం 10గం కన్నాయిగూడెం మండలంలోని దేవాదుల ప్రాజెక్టు పర్యటనకు ముఖ్యఅతిథిగా CM రేవంత్ రెడ్డి రానున్నట్లు తెలిపారు. జిల్లాలోని మహిళల కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై CM పర్యటనను విజయవంతం చేయాలన్నారు.

February 21, 2026 / 05:08 PM IST

‘ప్రేరణ విజయానికి తొలి అడుగు’

MDK: శివంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఓ ఫౌండేషన్, గురుకులం ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ‘ప్రేరణ విజయానికి తొలి అడుగు’ కార్యక్రమ నిర్వహించారు. విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని తొలగించి ఆత్మవిశ్వాసం పెంపొందిస్తూ ఉత్తమ ఫలితాలు సాధనకు మార్గదర్శనం చేయడానికి కార్యక్రమం చేపట్టినట్లు కో- ఆర్డినేటర్ శ్రీనివాస్ తెలిపారు. పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలన్నారు.

February 21, 2026 / 05:08 PM IST

ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేసిన ఎంపీడీవో

PDPL: ధర్మారం మండలం కొత్తూరు అంగన్వాడి, ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను ఎంపీడీవో వేముల సుమలత శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె ZP పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులతో సంభాషించారు. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్ సందర్శించారు. మధ్యాహ్న భోజనం, ప్రత్యేక స్టడీ అవర్స్ గురించి ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భూక్య సంగీత పాల్గొన్నారు.

February 21, 2026 / 05:07 PM IST

పదో తరగతిలో ఉత్తమ ఫలితాలే లక్ష్యం: కలెక్టర్

ADB: పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. విద్యార్థుల తల్లిదండ్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరీక్షల సన్నద్ధతపై దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాలల్లో ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామన్నారు.

February 21, 2026 / 05:07 PM IST

ఎలిప్యాడ్‌ను పరిశీలించిన ఎస్పీ

SRCL: గంభీరవుపేట మండలంలో ఉపముఖ్యమంత్రి, మంత్రుల బృందం పర్యటన నేపథ్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. పర్యటన దృష్ట్యా గంభీరవుపేట మండలంలో ఏర్పాట్లను,హెలిప్యాడ్‌ను ఎస్పీ స్వయంగా అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించి, అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలని తెలిపారు.

February 21, 2026 / 05:05 PM IST

ఆయిల్ పామ్ సాగుపై శిక్షణ కార్యక్రమం

KMM: ఎర్రుపాలెం మండలం నారాయణపురంలో ఆయిల్ పామ్ సాగుపై రైతులకు అవగాహన, శిక్షణ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మధిర మార్కెట్ కమిటీ ఛైర్మన్ బండారు నరసింహారావు మాట్లాడారు. ఆయిల్ పామ్ లాభదాయక పంటగా మారుతోందని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను రైతులు వినియోగించుకోవాలని సూచించారు.

February 21, 2026 / 05:05 PM IST

మాతృభాషను కాపాడుకోవాలి: ప్రిన్సిపల్ రవి

NLG: దేవరకొండలోని ఎంకేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా తెలుగు విభాగం ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రిన్సిపల్ డాక్టర్ రమావత్ రవి మాట్లాడుతూ.. మాతృభాష ఉనికిని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత మనందరిపైన ఉందని, మన సంస్కృతి, సంప్రదాయాలు మాతృభాషతో పెనవేసుకుని ఉంటాయని పేర్కొన్నారు.

February 21, 2026 / 05:03 PM IST

మిషన్ భగీరథ నీటి సరఫరా మూడు రోజులు నిలిపివేత

JGL: మెట్పల్లి మండలం వెంకట్రావు పేట గ్రామ సమీపంలో మిషన్ భగీరథ ప్రధాన పైపులైన్ లీకేజీ మరమ్మతు కారణంగా మూడు రోజులు నీటి సరఫరా నిలిపివేయనున్నట్లు మిషన్ భగీరథ కార్యనిర్వాహక ఇంజినీర్ తెలిపారు. కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి పరిధిలోని గ్రామాలకు, మున్సిపాలిటీలకు ఈనెల 23 నుంచి 25 వరకు నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు సహకరించాలని కోరారు.

February 21, 2026 / 05:03 PM IST

న్యూ పీజీ బాయ్స్ హాస్టల్ ఆకస్మిక తనిఖీ

MBNR: పాలమూరు విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ జీఎన్ శ్రీనివాస్, రిజిస్ట్రార్ ప్రొ. పీ. రమేష్ బాబు, న్యూ పీజీ బాయ్స్ హాస్టల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేసి ఆహార నాణ్యత, హాస్టల్ సౌకర్యాలపై విద్యార్థుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో చీఫ్ వార్డెన్ డా. మన్నెమోని కృష్ణయ్య, ప్రిన్సిపల్ డా.సీహెచ్. రవికాంత్ పాల్గొన్నారు.

February 21, 2026 / 05:02 PM IST

యూరియా కోసం ఉరితాడుతో వినూత్న రీతిలో నిరసన

SRPT: యూరియా యూప్ నిబంధనలకు వ్యతిరేకంగా పాలకవీడు పీఏసీఎస్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ నాయకుడు నవీన్ కుమార్ రైతులతో కలిసి వినూత్న రీతిలో శనివారం నిరసన తెలిపారు. మెడకు ఉరితాడు వేసుకొని ప్రభుత్వం తెచ్చిన కొత్త విధానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెంటనే ప్రభుత్వం యాప్ రద్దుచేసి పాత పద్ధతిలో రైతులకు యూరియా అందించాలన్నారు.

February 21, 2026 / 05:01 PM IST