సీఎం కేసీఆర్ (CM KCR)పై బీజేపీ నాయకురాలు విజయశాంతి (Vijayashanti) తీవ్ర విమర్మలు చేశారు. సీఎం అంటే క్రిమినల్ మినిస్టర్ అని బీజేపీ నాయకురాలు ఆమె ఆరోపించారు.హైదరాబాద్ (Hyderabad) లోని ఇందిరా పార్క్ లో "మా నౌకరీలు (Jobs) మాగ్గావాలి" పేరుతో బీజేపీ పార్టీ నిరుద్యోగ మహా ధర్నా చేపట్టింది. ఇల్లీగల్ దందా చేసేది కేసీఆర్ ప్రభుత్వమేనని అన్నారు. టీఎస్పీఎస్సీ (TSPSC) పేపర్ లీక్ వ్యవహారం.. కేసీఆర్ ప్రభుత్వంల...
బీజేపీ (BJP) స్టేట్ చీఫ్ బండి సంజయ్ కొడుకు బండి సాయి భగీరథ(Bandi Sai Bhagiratha)పై వివాదం మరింత వేడెక్కింది. తోటి విద్యార్థులను కొడుతున్న రెండు వీడియోలు బయటకు రావడంతో రాజకీయ దుమారం రేగింది తెలిసిందే. వరుస వివాదాలు, కేసులు కారణంగా సాయి భగీథపై మహేంద్ర యూనివర్సటీ (Mahendra University) నుండి సస్పెండ్ చేశారు. దీనిపై కూడా విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది.ఈ వీడియోలో బండి సంజయ్ (Bandi Sanjay) కొడుకు క...
అడపాదడపా కురుస్తున్న వర్షాల(rains) కారణంగా వేసవి తాపం నుంచి నగరవాసులు ఊపిరి పీల్చుకున్నప్పటికీ, మామిడి ప్రియులకు(mango lovers) మాత్రం ఇది చేదువార్త అని చెప్పవచ్చు. అకాల వర్షాలు సహా చీడ పీడల కారణంగా మామిడి పండ్ల ఉత్పత్తి తగ్గిపోయిందని రైతులు వాపోతున్నారు. ఈ క్రమంలో మామిడి పండ్ల సరఫరా తక్కువగా ఉండడంతో ధరలు(prices) ఎక్కువగా ఉంటాయని, వాటిని కొనుగోలు చేయడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారే అవకాశం ఉంది.
తెలంగాణలో ప్రతి ఒక్క నిరుద్యోగికి లక్ష రూపాయల నిరుద్యోగ భృతి ఇవ్వాలని బీజేపీ(BJP) తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్(Bandi Sanjay) డిమాండ్ చేశారు. మరోవైపు TSPSC లికేజీ కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తప్పు చేయకుంటే ఎందుకు విచారణ జరిపించడం లేదని సంజయ్ ప్రభుత్వాన్ని నిలదీశారు. లేదంటే ట్విట్టర్ టిల్లు ఈ కేసుకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని సవాల్ చేశారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ప్రత్యేక దర్యాప్తు టీమ్ సిట్(SIT) వేగం పెంచింది. తెలంగాణలో సంచలనంగా తయారైన TSPSC లికేజీ కేసు(TSPSC leakage case)లో మరొకరు అరెస్టు అయ్యారు. మహబూబ్ నగర్ జిల్లా(mahabubnagar district) నవాబ్ పేట ఉపాధి హామీలో పనిచేసే ఉద్యోగి ప్రశాంత్(prashanth)ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్(hyderabad) నగరంలో మరో భారీ అగ్ని ప్రమాదం(fire accident) జరిగింది. ఈ అగ్ని ప్రమాదం దాటికి కారులో నిద్రిస్తున్న వ్యక్తి సజీవ దహనం చెందాడు. ఈ ఘటన హైదరాబాద్లోని కింగ్ కోఠి(king koti)లో చోటుచేసుకుంది.
విద్యుత్ వినియోగదారులకు ఈఆర్సీ (ERC) గుడ్ న్యూస్ చెప్పింది. 2023-24 ఆర్ధిక సంవత్సరంకు విద్యుత్ ఆదాయ వ్యయాల ప్రతిపాదనలను ఆమోదించిన ఈఆర్సీ.. విద్యుత్ వినియోగదారులకు భారం లేకుండా నిర్ణయం తీసుకుంది. డిస్కంల నష్టం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని తెలంగాణ ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగారావు (Chairman Sri Ranga Rao) తెలిపారు. సబ్సిడీ, ఇరిగేషన్, ఇతర సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన సబ్సిడీని డిస్కంలకు భారం పడకుండ...
ఉస్మానియా యూనివర్సిటీ (OU) మరోసారి తెలంగాణ (Telangana) ఉద్యమ రూపాన్ని తలపించింది. విద్యార్దుల నిరసనలు, అరెస్టులతో ఆర్ట్స్ కాలేజ్ (Arts College) దద్దరిల్లింది. అరెస్టులతో ఉద్యమాల గడ్డ ఓయు (OU) అనే విషయం గుర్తుంచుకోవాలని పలువురు విద్యార్ది నాయకులు హెచ్చరించారు. మరో వైపు రేవంత్ రెడ్డి ఓయూకు వస్తున్నాడనే నేపధ్యంలో పలువురు బీఆర్ఎస్వీ (BRSV) నాయకులు అడ్డుకొని తీరుతాం అంటూ నిరసనలు వ్యక్తం చేశారు.
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు(dil raju) రాజకీయాల్లోకి రాబోతున్నారని మళ్లీ చర్చలు ఊపందుకున్నాయి. ఇటీవల నిజమాబాద్ జిల్లా(nizamabad district)లో దిల్ రాజు స్వయంగా నిర్మించి నిర్వహిస్తున్న గుడికి రేవంత్ రెడ్డిని(revanth reddy) ఆహ్వానించడంతో ఈ వార్తలు మళ్లీ మొదలయ్యాయి. అయితే వీటిపై దిల్ రాజు నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.
కాంగ్రెస్ పార్టీ (Congress party) ఎంపీ రాహుల్ గాంధీపై (Rahul Gandhi) పార్లమెంట్ అనర్హత వేటు వేయడాన్ని సీఎం కేసీఆర్ (CM KCR) త్రీవంగా ఖండించారు.నేడు భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో చీకటిరోజు అన్నారు. ప్రధాని మోదీ (PM Modi) పాలన ఎమర్జెన్సీ ని మించిపోతుందని కేసీఆర్ మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ దురహంకారానికి, నియంతృత్వానికి పరాకాష్ట అన్నారు. నేరస్తులు, దగాకోరుల కోసం ప్రతిపక్ష నాయకులపై...
పెద్దపల్లి జిల్లా రామగుండం(Ramagundam) ఎన్టీపీసీలో తొలిసారిగా విద్యుదుత్పత్తి నమోదైంది. ఏపీ (AP) పునర్వస్థీకరణ చట్ట ప్రకారం తెలంగాణకు (Telangana) కేటాయించిన 4వేల మెగావాట్లలో ఫేస్ 1 కింద నిర్మించిన అల్ట్రా సూపర్ క్రిటికల్ 1600 మెగావాట్ల తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయి. ఇందులో భాగంగా ప్రథమంగా 800మెగావాట్ల 1వ యూనిట్లో గురువారం విద్యుదుత్పత్తి ప్రారంభం కాగా శుక్రవారం మ...
సీనియర్ నటుడు మోహన్ బాబు (Mohan Babu) మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య తీవ్ర విభేదాలు ఉన్నట్టు ఓ వీడియోతో స్పష్టమైంది. ఈ వీడియో వైరల్ అయిన నేపథ్యంలో మంచు విష్ణు (Manchu Vishnu) స్పందించారు. ఈ ఘటన నిన్న ఉదయం జరిగిందని, ఇదేమంత పెద్ద గొడవ కాదని క్లారిటీ ఇచ్చారు. మనోజ్ తన తమ్ముడని, తామిద్దరి మధ్య గొడవలు సాధారణమైన విషయం అని మంచు విష్ణు తెలిపారు. సారథి (Sarathi) తనతో గొడవ (fight)పెట్టుకుంటే, మనోజ్ ఈ వాగ్...
తెలంగాణలో రేపు(మార్చి 25న) నిర్వహించనున్న బీజేపీ(BJP) మహా ధర్నాకు హైకోర్టు(telangana High Court) అనుమతి ఇచ్చింది. అయితే ఈ నిరసనలో కేవలం 500 మంది మాత్రమే పాల్గొనాలని వెల్లడించింది.
తెలంగాణలో(Telangana) రాబోయే మూడు రోజుల వరుకు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడొచ్చని హైదరాబాద్ (Hyderabad) వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో శుక్రవారం కుండపొత వానాలు కురిసే అవకాశం ఉందని వెదర్ డిపార్ట్ మెంట్(Weather Department) తెలిపింది.శని, ఆదివారాల్లో అక్కడక్కడా మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.