PDPL: తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం కోసం మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించడంతో పెద్దపల్లి ఉద్యమకారుల ఫోరం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ప్రెస్క్లబ్లో సమావేశమైన నాయకులు, ప్రజాప్రభుత్వం ఉద్యమకారుల సంక్షేమానికి కట్టుబడి ఉండటం సంతోషకరమని తెలిపారు. ఫోరం కన్వీనర్ ఐలయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
SRCL : తంగళ్ళపల్లి మండలం సారంపల్లిలో సర్పంచ్ గుగ్గిళ్ళ లావణ్య ఆధ్వర్యంలో ఆదివారం చిన్నారులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. పిల్లలకు పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భరత్ గౌడ్, మునిగేలా రాజు, వార్డ్ సభ్యులు ఖాదర్, భారతవ్వ, హనీఫ్, గంగారాం తదితరులు పాల్గొన్నారు. సర్పంచ్ చొరవను గ్రామస్తులు అభినందించారు.
NLG: ‘సీఎం-కప్’ రాష్ట్రస్థాయి క్రీడల్లో ఆమనగల్లు గ్రామానికి చెందిన నలబాల లిఖిత 400 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకం సాధించి రికార్డు సృష్టించింది. 33 జిల్లాల నుంచి పాల్గొన్న పోటీదారులలో మూడవ స్థానంలో నిలిచి తన ప్రతిభను చాటింది. గ్రామీణ క్రీడాకారులకు ‘సీఎం-కప్’ గొప్ప వేదికని, తన తదుపరి లక్ష్యం జాతీయ స్థాయికి ఎంపిక కావడమేనని లిఖిత పేర్కొంది.
MDCL: అల్వాల్ TIMS ఆసుపత్రి నిర్మాణంలో వేగం పెరిగినట్లుగా అక్కడి ఇంజనీర్లు తెలిపారు. ఈ ఏడాదిలోనే TIMS ఆసుపత్రి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే చివరి దశలో వర్క్ కొనసాగుతుండగా, ఇది అందుబాటులోకి వస్తే పరిసర ప్రాంతాల వారికి ప్రభుత్వ వైద్యం మరింత చేరువవుతుందని స్థానిక డాక్టర్ శివప్రకాష్ వర్మ తెలిపారు.
MDK: రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో ఆదివారం గ్రామపంచాయతీ వద్ద అటవీ శాఖ ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎఫ్ఆర్వో కుద్బుద్దిన్ మాట్లాడుతూ.. అడవుల పరిరక్షణకై ప్రతి ఒక్కరు సహకరించాలని, అడవిలో అగ్ని ప్రమాదాలు జరిగితే వెంటనే సమాచారం అందించాలని గ్రామస్తులకు సూచించారు.
RR: బాన్సువాడ హింసలో గాయపడిన బాదిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళుతున్న BJP రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావును అడ్డుకుని నిర్బంధించడం ప్రభుత్వ దౌర్జన్యానికి పరాకాష్ట అని SDNR BJP నేత శ్రీవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. అసలు దుండగులను వదిలిపెట్టి బాధితుల పక్షాన నిలిచిన నాయకుడిని అరెస్టు చేయడం అధికార దుర్వినియోగానికి ఉదాహరణ అన్నారు.
PDPL: రామగుండం కార్పొరేషన్ డివిజన్లలో కనీస సౌకర్యాలు కల్పించి, అభివృద్ధి కార్యక్రమాలను పటిష్టంగా చేపట్టాలని CPI నాయకులు కనకరాజు, కార్పొరేటర్ మార్కాపురి సూర్య మేయర్ మహంకాళి స్వామిని ఆదివారం కలిసారు. మార్కండేయ కాలనీలో సమస్యలపై చర్చించి, పనులను తక్షణమే అమలు చేయమని కోరారు. గోశిక మోహన్, గౌతం గోవర్ధన్, తాళ్లపల్లి మల్లయ్య, శంకర్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.
WNP: పట్టణంలోని 14వ వార్డు అధ్వాన్నంగా తయారైంది. స్థానిక బ్రహ్మంగారి ఆలయం వెనుక భాగం ప్రస్తుతం చెత్తాచెదారంతో నిండి, ఒక మినీ డంపింగ్ యార్డ్ను తలపిస్తోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో హడావుడి చేసిన అధికారులు, ఆ తర్వాత అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో వార్డు ప్రజలు మండిపడుతున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు.
VKB: బండల ఇళ్ల కారణంగా గృహలక్ష్మీ లబ్ధిదారులు అయినప్పటికీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సోలార్ పథకానికి అర్హత పొందలేకపోతున్నారని కొడంగల్ మున్సిపల్ ఛైర్మన్ ప్రశాంత్ అన్నారు. ప్రభుత్వం వారిని గుర్తించి కాంక్రీట్ రూఫ్ నిర్మాణం కోసం రూ. 2 లక్షలు మంజూరు చేసేలా స్పెషల్ చీఫ్ సెక్రటరీ నవీన్ చొరవ తీసుకోవాలని కోరారు. విద్యుత్ సమస్యలకు కూడా ఉపశమనం సాధించవచ్చని అన్నారు.
NGKL: శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (SLBC) సొరంగం కూలిన భారీ ప్రమాదానికి నేటితో ఏడాది పూర్తయింది. దేశ చరిత్రలోనే అతిపెద్ద భూగర్భ ప్రమాదంగా నిలిచిన ఈ ఘటనలో జయప్రకాశ్ ఇంజినీరింగ్ కంపెనీకి చెందిన ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఆరుగురి ఆచూకీ నేటికీ లభ్యం కాకపోవడం వారి కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది.
SRPT: పేదల ముఖంలో చిరునవ్వు చూడడమే మా ప్రజా ప్రభుత్వ ద్వేయమని ఏఐసీసీ సభ్యులు సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేట మండలం కాసరబాధ గ్రామంలో దూడిగ రాములు ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన మాట నెరవేర్చి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని తెలియజేశారు.
RR: చౌదరిగూడ మండలం పెద్ద ఎల్కిచర్ల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు అరవింద్ రెడ్డి మాతృమూర్తి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ వార్త తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ వారి నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ అరవింద్ రెడ్డికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
HYD: శామీర్పేటలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే హౌస్ అరెస్ట్లో ఉన్న ఈటల నివాసానికి పోలీసులు మరోసారి చేరుకుని బయటికి వెళ్లేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు. పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన నిఘా కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ వైఖరిపై ఈటల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం.
సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. పగటి పూట ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. వేడి గాడ్పులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం నుంచే భానుడు భగ భగ మండిపోతున్నాడు. ఇళ్లలో నుంచి బయటకు రావాలంటేనే ఎండ వేడిమికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్న పరిస్థితి. ఉదయం 9 గంటల నుంచే సూర్యుడు ఠారెత్తిస్తున్నాడు.
MNCL: జన్నారం మండలంలోని సర్పంచ్లకు, వార్డు సభ్యులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎంపీడీవో ఉమర్ షరీఫ్, ఎంపీవో జలంధర్ తెలిపారు. మంచిర్యాల మండలంలోని ముల్కాల ఐజా ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం నుంచి సర్పంచ్లకు శిక్షణ కార్యక్రమం ఉంటుందన్నారు. మండలంలోని 10 గ్రామాలలో నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులకు పోన్కల్ రైతు వేదికలో శిక్షణ ఉంటుందన్నారు.