సిద్దిపేట పట్టణంలోని 37వ వార్డులో BRS పార్టీ కార్యాలయాన్ని మాజీ మంత్రి హరీష్ రావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 26 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రజలకిచ్చిన హామీలకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ బడ్జెట్నైనా వాస్తవాల ఆధారంగా రూపొందించి హామీలన్నీ నెరవేర్చాలని చెప్పుకొచ్చారు.
RR: చేవెళ్ల నియోజకవర్గం శంకర్పల్లి మున్సిపల్ నూతన ఛైర్మన్ సాత ప్రవీణ్ కుమార్ను మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ వెంకట్రాంరెడ్డి సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. మున్సిపల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానని ప్రవీణ్ కుమార్ తెలిపారు.
WGL: నెక్కొండ (M) కేంద్రంలోని పత్తిపాక తండాకు చెందిన బి రజిత–లక్ష్మణ్ దంపతులు నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని MLA దొంతి మాధవరెడ్డి ప్రారంభించారు. నూతన గృహప్రవేశ కార్యక్రమానికి హాజరైన ఆయన, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పేద కుటుంబానికి సొంతింటి కల నెరవేరిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత 10 సం,రాలు అధికారంలో ఉన్న BRS ప్రభుత్వం ఇళ్లు ఇవ్వలేదని అన్నారు.
NZB: రాజంపేటలో 157వ బూత్ బీజేపీ అధ్యక్షుడు జూకంటి రాజిరెడ్డి తండ్రి, సోదరుడు ఇటీవల అకాల మరణం చెందడంతో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆ కుటుంబాన్ని పరామర్శించారు. అకాల మరణం చెందడం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేసి, వారి కుటుంబానికి అండగా ఉంటామని, ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఆయనతో బాటు మున్సిపల్ కౌన్సిలర్లు, బీజేపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
GDWL: మున్సిపల్ నూతన చైర్పర్సన్గా తుమ్మల జయలక్ష్మి శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలోని ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆమెను అభినందించారు. అందరి సహకారంతో గద్వాల మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే కోరారు.
MNCL: రెవిన్యూ శాఖలో ఎంతో కాలంగా పనిచేస్తున్న టైపిస్ట్, కంప్యూటర్ ఆపరేటర్లను కొనసాగించాలని అధ్యక్షుడు వెంకటేష్ కోరారు. ఈ మేరకు శుక్రవారం వారు టీఎన్జీవోస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరికి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ పథకాల అమలు , ఎన్నికల నిర్వహణలో కృషి చేసిన కంప్యూటర్ ఆపరేటర్లను ఇతర ఉద్యోగాలకు వెళ్లాలనడం కష్టంగా ఉందని తెలిపారు.
NGKL: తెల్కపల్లి మండలం కార్వంగ గ్రామంలో నూతన సీసీ రోడ్లకు శుక్రవారం ఎమ్మెల్యే డా.కూచుకుళ్ల రాజేష్ రెడ్డి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. కార్వంగ గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం ద్వారా ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా సదుపాయం కలుగుతుందన్నారు.
NZB: భీమగల్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ కుక్, డ్రై స్వీపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు స్పెషల్ ఆఫీసర్ అనురాధ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 20 నుంచి 23 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు దారులు స్థానికులై ఉండాలని, 7వ తరగతి బోనాఫైడ్ జతచేసి పాఠశాలలో అందజేయాలని కోరారు.
NLG: బోడుప్పల్లోని కేశవనగర్లో ఏర్పాటు చేసిన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో శుక్రవారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులతో కలిసి మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని వేడుకున్నారు.
నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం గోటూరు గ్రామంలో ఇవాళ సాయంత్రం 5 గంటలకు తెలంగాణ బహుజనుల ఆత్మ గౌరవ ధూంధాం కళాకారులచే ఒక సమావేశం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రహీం శేఖర్ ముఖ్య అతిథిగా హాజరవుతారు.నాయకులు యువత అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండల అధ్యక్షులు గౌతం కోరారు.
BDK: ఇల్లందు మండలం మాణిక్యరం గ్రామంలో శుక్రవారం సీతారామచంద్ర స్వామి వారి నూతన ఆలయ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొన్నారు. ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆ స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ నియోజకవర్గ ప్రజలపై ఉండాలని మనసారా కోరుకున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.
మహబూబ్నగర్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, లోకల్ బాడీ, కేజీబీవీ, మోడల్ స్కూళ్లలో ఈ నెల 21న పేరెంట్-టీచర్ మీటింగ్ నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) ఆదేశించారు. నేపథ్యంలో పిల్లలకు ఇంటి వద్ద సహాయం ఎలా అందించాలన్న దానిపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించనున్నారు. ముఖ్యంగా 10వ తరగతి, అలాగే 2వ, 3వ తరగతి ఎఫ్ఎల్ఎన్/ ఎఫ్ఎల్ఎస్ పరీక్షల డీఈవో సూచించారు.
RR: తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసుకున్న ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి, మహేశ్వరం నియోజకవర్గం నాగారం గ్రామానికి చెందిన సిరిపురం యాదయ్య వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈరోజు మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన సేవలను కొనియాడారు.
KNR: గంగాధర మండలంలోని బురుగుపల్లి గ్రామంలో ప్లాస్టిక్ వినియోగం తగ్గించేందుకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ దులం కళ్యాణ్ ఆధ్వర్యంలో కిరాణా, చికెన్, మటన్ షాప్ యజమానులతో సమావేశం ఏర్పాటు చేసి, ప్లాస్టిక్ కవర్లకు బదులుగా బయోడీగ్రేడబుల్ కవర్లు వినియోగించాలని సూచించారు. ఈ సందర్భంగా MPDO ప్లాస్టిక్ వల్ల పర్యావరణం నష్టాలను వివరించారు.
HYD: నగరంలోని సీబీఐ కోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో అప్రమత్తమైన పోలీసులు తనిఖీలు చేపట్టారు. బాంబు స్క్వాడ్తో కలిసి కోర్టు ప్రాంగణాన్ని పరిశీలిస్తున్నారు. రెండు రోజుల క్రితమే ఇలాంటి బెదిరింపు మెయిల్ వచ్చిన నేపథ్యంలో మళ్లీ అదే తరహా సందేశం రావడం ఆందోళన కలిగిస్తోంది. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.