నల్గొండ: మిర్యాలగూడెం నందిపాడు చౌరస్తా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మహారాష్ట్రకు చెందిన కంటైనర్ అతివేగంగా వచ్చి బైకును, నాలుగు వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. కంటైనర్ డ్రైవరు తీవ్రగాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని కేసు నమోదు చేశారు.