KMM: ఎర్రుపాలెం మండలం సీపీఎం పార్టీ మండల కమిటీ, రైతు సంఘం ఆధ్వర్యంలో గురువారం మామునూరు గ్రామ వరి, మొక్కజొన్న పొలాలను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా నాయకులు దివ్వెల వీరయ్య మాట్లాడుతూ.. రైతు సమస్యల పట్ల సంబంధిత అధికారులు స్పందించి లంకా సాగర్ నుంచి కట్లరు నదికి నీరు వదలాలని డిమాండ్ చేశారు.