KMR: కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కొనుగోలు కేంద్రానికి పత్తి అమ్మకానికి భారీగా వస్తోంది. మద్నూర్ కొనుగోలు కేంద్రంలో 7,570 మంది రైతుల నుంచి 1,19,130 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసినట్లు వ్యవసాయ మార్కెట్ శాఖ అధికారులు తెలిపారు. ప్రైవేటులో 13,443 క్వింటాళ్లు కొనుగోలు చేసినట్లు వివరించారు.