శ్రీలంకతో జరుగుతున్న చివరి టీ20లో భారత మహిళా జట్టు బ్యాటింగ్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టానికి 175 పరుగులు చేసింది. హర్మన్ప్రీత్ కౌర్ (68) హాఫ్ సెంచరీతో ఆకట్టుకుంది. అరుంధతి రెడ్డి (27*) అమన్జ్యోత్ (21), హర్లీన్ (13), కమలినీ (12) పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో కవిష, రష్మిక, చమరి తలో రెండు వికెట్లు తీశారు.