SRPT: కోదాడ పట్టణంలోని శ్రీనివాస్ నగర్ 30వ వార్డులో శ్రీ రామ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో, ఆదివారం రాత్రి గణేష్ విగ్రహం వద్ద లక్ష దీపోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని దీపాలను వెలిగించారు. అనంతరం గణేష్ విగ్రహం వద్ద మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.