NZB: బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని మాల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిజామాబాద్ నగరంలోని అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు ఆనంపల్లి ఎల్లయ్య, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎడ్ల నాగరాజ్, జిల్లా కార్యదర్శి వినయ్ కుమార్, ఉద్యోగుల అధ్యక్ష కార్యదర్శులు అలుక కిషన్, అమృత్ తదితరులు ఉన్నారు.