BDK: పినపాక మండలం పట్టి నగర్ పంచాయతీలో శుక్రవారం రైతు సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూభారతి చట్టాన్ని అమలుపరస్తుందని గత ప్రభుత్వంలో ధరణి పోర్టల్ వల్ల అనేక అవకతవకలు జరిగాయని, అనేకమంది రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని తెలిపారు.