MHBD: కురివి వీరభద్ర స్వామి ఆలయాన్ని మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ ఛైర్మన్ సుధాకర్ ఈరోజు సందర్శించారు. ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటిసారిగా వీరభద్రస్వామి దర్శనానికి వచ్చిన ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఆయనకు స్వామివారి తీర్ధప్రసాదాలు అందజేసి, ఆశీర్వచనాలు ఇచ్చారు.