BHPL: మేడిగడ్డ బ్యారేజ్ ఎగువ ప్రాంతం గోదావరి నదిలో విద్యార్థుల గల్లంతుపై మంత్రి శ్రీధర్ బాబు శనివారం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆచూకీ తెలుసుకునేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేయాలని మంత్రి ఆదేశించారు. పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టాలన్నారు. కాగా, ప్రస్తుతం గజ ఈతగాళ్లతో మృత దేహాలను వెలికితీసే యత్నం చేస్తున్నారు.