ప్రకాశం: కొత్తపట్నం మండల తహసీల్దార్ కార్యాలయానికి నూతన ఎమ్మార్వోగా కే. శాంతిని నియమించారు. ప్రస్తుతం ఆమె దోర్నాల ఎమ్మార్వోగా విధులు నిర్వహిస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా MROలను బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఆ బదిలీల్లో భాగంగా కొత్తపట్నానికి నూతన ఎమ్మార్వోగా వస్తున్నట్లు తెలిసింది. కాగా సోమవారం కొత్తపట్నం MROగా బాధ్యతలు చేపట్టనున్నారు.