KMM: జిల్లా వ్యాప్తంగా నిన్న ఉదయం 8:30 నుంచి ఇవాళ ఉదయం 8:30 వరకు 5.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. నేలకొండపల్లిలో 0.4, ముదిగొండలో 2.0, తల్లాడలో 2.8 మిల్లీమీటర్లు నమోదు అయిందని చెప్పారు. ఇతర మండలంలో ఎలాంటి వర్షపాతం నమోదు కాలేదని అన్నారు. అటు రాగల 3 రోజులు జిల్లాలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.