TG: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీ వద్ద గోదావరిలో గల్లంతైన యువకుల కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన ఆరుగురిలో ఇప్పటివరకు ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. రక్షిత్, రాహుల్, సాగర్ మృతదేహాలను నది నుంచి వెలికితీశారు. మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. కాగా.. నిన్న మేడిగడ్డ వద్ద గోదావరిలో యువకులు గల్లంతైన విషయం తెలిసిందే.