BHPL: తాడిచెర్ల నుంచి మంథనికి వెళ్లే మట్టి రోడ్డుపై క్యూరింగ్ చేపట్టాలని ఆదివారం వాహనదారులు కోరుతున్నారు. ఓసీపీ విస్తరణలో బీటీ రోడ్డును ధ్వంసం చేసి, 3 కి.మీ. మేర మట్టి రోడ్డు వేశారు. క్యూరింగ్ లేకపోవడంతో దుమ్ము, ధూళితో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారిందని, వెంటనే చర్యలు తీసుకోవాలని వారు మండిపడుతున్నారు.