కృష్ణా: నందివాడ మండలం పోలుకొండ రెగ్యులేటర్ వద్ద నుండి రుద్రపాక వెళ్లే జిపికే రోడ్డుకు ఇరవైపులా ముళ్ళ కంచె దట్టంగా పెరిగిపోవడంతో ఇబ్బందికరంగా మారిందని ప్రయాణికులు వాపోయారు. రెగ్యులేటర్ మలుపు వద్ద పెరిగిన కంచి వలన ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందని వారు అంటున్నారు. సంబంధిత అధికారులు స్పందించి ముళ్ల కంచెను తొలగించాలని కోరుతున్నారు.