కోనసీమ: రుతుపవనాలు సమీపిస్తున్నందున నేటి నుంచి బహిరంగ ఇసుకరీచ్లలో ప్రత్యక్ష విక్రయాలు నిలిపివేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ శనివారం తెలిపారు. స్టాక్ యార్డుల ద్వారా మాత్రమే ఇసుక విక్రయాలు జరుగుతాయాన్నారు. రావులపాలెం, గోపాలపురం జొన్నాడ, అమలాపురం, తదితర రీచ్లలో ఇసుక విక్రయాలు జరగవని తెలిపారు.