ADB: ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా ముందుకు కొనసాగాలని విద్యాశాఖ కార్యదర్శి యోగిత రాణి సూచించారు. శుక్రవారం రాత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా పాల్గొన్నారు. పాఠశాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, పోషకాహార పథకాలు, పరిశుభ్రత, విద్యార్థుల భద్రత, డిజిటల్ విద్య, తదితర అంశాలపై చర్చించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.