సంగారెడ్డి: తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతమ్, జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు శుక్రవారం సంగారెడ్డి పట్టణంలో పర్యటించారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారుల నివాస ప్రాంతాలను సందర్శించి, వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.