JN: బతుకమ్మ కుంట స్పెషల్ అట్రాక్షన్గా కనిపించేలా అభివృద్ధి పనులు జరగాలని కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ అన్నారు. జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి కలెక్టర్ మాట్లాడారు. రూ.1.5 కోట్లతో బతుకమ్మ కుంట పనులు జరుగుతున్నాయని తెలిపారు. సుందరీకరణలో భాగంగా గ్రిల్స్, వ్యాయామ పరికరాలు, చిన్నారుల ఆటస్థలం ఏర్పాటుకు కృషి చేసినట్లు తెలిపారు.