SKLM: జలుమూరు మండలం లింగాలవలస పంచాయతీ ఉసిరికిజ్వాల, చల్లవానిపేట, ఎలమంచిలి గ్రామాల్లో కోట్ల రూపాయలతో నిర్మించిన రహదారులను శుక్రవారం మధ్యాహ్నం కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రారంభిస్తున్నారు. నరసన్నపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతాయని సర్పంచ్లు తెలిపారు.